కెజిఎఫ్, సలార్ తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాలను పరిచయం చేసి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ తమిళంలో ఇప్పటికే అది ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందుతున్న సినిమాకు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా మొన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 మొదలవబోతోందని కొన్ని పేరున్న ట్విట్టర్ హ్యాండిల్స్ లో రావడం అభిమానుల్లో అయోమయానికి దారి తీసింది.
హోంబాలే ఫిలింస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ఇతరులు చెప్పడం గురించి రకరకాల ప్రచారం జరిగిపోయింది. బెంగళూరు టాక్ చూస్తూనేమో ప్రశాంత్ నీల్ మీద సలార్ 2 శౌర్యంగపర్వం త్వరగా పూర్తి చేసే తారక్ ప్రాజెక్టుకు వెళ్లిపొమ్మని నిర్మాణ సంస్థ అడిగిందట. కానీ అందులో నిజం లేదని ప్రభాస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నిజంగా నీల్ ఇప్పటికిప్పుడు సలార్ 2 తీయాలంటే డార్లింగ్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాదని, కానీ ప్రస్తుతమున్న కమిటీ మెంట్ల దృష్ట్యా ఇంకో సంవత్సరం తర్వాత కానీ సాధ్యపడదని గుర్తించి ఆ మేరకు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారని వినికిడి.
జూనియర్ ఎన్టీఆర్ జనవరి లేదా ఫిబ్రవరి లోగా వార్ 2కి సంబంధించిన మొత్తం షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కోసం ఫ్రీ అవుతాడు. దేవర 2 ఇప్పుడప్పుడే అర్జెంట్ గా మొదలుపెట్టే ప్లాన్ ఏదీ లేదు. ఎలాగూ 2026 సంక్రాంతి రిలీజని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు కానీ ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ పూర్తిగా ఒకే ప్రాజెక్ట్ మీదే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సలార్ 2 సాధ్యం కాదు. కెజిఎఫ్ 3 ఉండొచ్చని యష్ చెప్పాడు కానీ టాక్సిక్, రామాయణం అయ్యేలోపు 2027 వచ్చేస్తుంది. ఆలోగా ప్రశాంత్ నీల్ పైన రెండు సినిమాలు గుమ్మడికాయ కొట్టేసి వచ్చేస్తాడు. సో దేని గురించి ఒత్తిడి లేదన్నమాట.
This post was last modified on October 25, 2024 2:08 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…