డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులు ఎక్కువ చూసిన కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా క. ఒకే అక్షరంని టైటిల్ గా పెట్టుకున్న చిత్రాలు గత కొన్నేళ్లలో ఏవీ రాలేదు. ఆ రకంగా చూసినా ఇది వెరైటీ ప్రయోగమే. స్వంతంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు కథ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెట్టిన ‘క’ వచ్చే వారం అక్టోబర్ 31 దీపావళి పండగ సందర్భంగా రిలీజవుతోంది. పోటీ ఎక్కువగా ఉన్నా సరే చాలా ధీమాగా కాంపిటీషన్ ఎదురుకోబోతున్నాడు.
అందుకే అంచనాల పరంగా అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం చేశారు. విజయవాడలో లాంచ్ ఈవెంట్ చేసి ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. కొన్ని పదుల సంవత్సరాల క్రితం కొండల మధ్య ఉండే ఒక మారుమూల గ్రామంలో పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ (కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వేరే వ్యక్తి రాసిన ఉత్తరం చదవడం వల్ల ప్రమాదంలో పడతాడు. ఊరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రాణాలకు తెగించి అతనేం చేశాడనేదే స్టోరీ.
దర్శకుడు సుజిత్ అండ్ సందీప్ చెప్పిన కథని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉందని గుర్తించిన కిరణ్ ఇప్పటికైతే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అవసరం లేని మూస, మాస్ జోలికి పోకుండా విరూపాక్ష, మంగళవారం తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘క’ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పోటీలో మనుగడ సాధించాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పనిసరి. సామ్ సిఎస్ నేపధ్య సంగీతంతో పాటు ఆర్ట్ వర్క్, సాంకేతిక వర్గం పనితనం అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఆడియన్స్ తత్వాన్ని అర్థం చేసుకున్న కిరణ్ కి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం.
This post was last modified on %s = human-readable time difference 11:23 am
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…
గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె…