డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులు ఎక్కువ చూసిన కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా క. ఒకే అక్షరంని టైటిల్ గా పెట్టుకున్న చిత్రాలు గత కొన్నేళ్లలో ఏవీ రాలేదు. ఆ రకంగా చూసినా ఇది వెరైటీ ప్రయోగమే. స్వంతంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు కథ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెట్టిన ‘క’ వచ్చే వారం అక్టోబర్ 31 దీపావళి పండగ సందర్భంగా రిలీజవుతోంది. పోటీ ఎక్కువగా ఉన్నా సరే చాలా ధీమాగా కాంపిటీషన్ ఎదురుకోబోతున్నాడు.
అందుకే అంచనాల పరంగా అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం చేశారు. విజయవాడలో లాంచ్ ఈవెంట్ చేసి ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. కొన్ని పదుల సంవత్సరాల క్రితం కొండల మధ్య ఉండే ఒక మారుమూల గ్రామంలో పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ (కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వేరే వ్యక్తి రాసిన ఉత్తరం చదవడం వల్ల ప్రమాదంలో పడతాడు. ఊరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రాణాలకు తెగించి అతనేం చేశాడనేదే స్టోరీ.
దర్శకుడు సుజిత్ అండ్ సందీప్ చెప్పిన కథని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉందని గుర్తించిన కిరణ్ ఇప్పటికైతే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అవసరం లేని మూస, మాస్ జోలికి పోకుండా విరూపాక్ష, మంగళవారం తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘క’ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పోటీలో మనుగడ సాధించాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పనిసరి. సామ్ సిఎస్ నేపధ్య సంగీతంతో పాటు ఆర్ట్ వర్క్, సాంకేతిక వర్గం పనితనం అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఆడియన్స్ తత్వాన్ని అర్థం చేసుకున్న కిరణ్ కి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం.
This post was last modified on October 25, 2024 11:23 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…