డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులు ఎక్కువ చూసిన కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా క. ఒకే అక్షరంని టైటిల్ గా పెట్టుకున్న చిత్రాలు గత కొన్నేళ్లలో ఏవీ రాలేదు. ఆ రకంగా చూసినా ఇది వెరైటీ ప్రయోగమే. స్వంతంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు కథ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెట్టిన ‘క’ వచ్చే వారం అక్టోబర్ 31 దీపావళి పండగ సందర్భంగా రిలీజవుతోంది. పోటీ ఎక్కువగా ఉన్నా సరే చాలా ధీమాగా కాంపిటీషన్ ఎదురుకోబోతున్నాడు.
అందుకే అంచనాల పరంగా అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం చేశారు. విజయవాడలో లాంచ్ ఈవెంట్ చేసి ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. కొన్ని పదుల సంవత్సరాల క్రితం కొండల మధ్య ఉండే ఒక మారుమూల గ్రామంలో పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ (కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వేరే వ్యక్తి రాసిన ఉత్తరం చదవడం వల్ల ప్రమాదంలో పడతాడు. ఊరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రాణాలకు తెగించి అతనేం చేశాడనేదే స్టోరీ.
దర్శకుడు సుజిత్ అండ్ సందీప్ చెప్పిన కథని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉందని గుర్తించిన కిరణ్ ఇప్పటికైతే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అవసరం లేని మూస, మాస్ జోలికి పోకుండా విరూపాక్ష, మంగళవారం తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘క’ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పోటీలో మనుగడ సాధించాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పనిసరి. సామ్ సిఎస్ నేపధ్య సంగీతంతో పాటు ఆర్ట్ వర్క్, సాంకేతిక వర్గం పనితనం అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఆడియన్స్ తత్వాన్ని అర్థం చేసుకున్న కిరణ్ కి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం.
This post was last modified on October 25, 2024 11:23 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…