Movie News

మీడియా ముందుకు రానున్న జానీ?

తెలుగు, తమిళ భాషల్లో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాక.. ‘తిరు’ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా గెలుచుకుని కొన్ని నెలల ముందు కెరీర్ పీక్స్‌‌ను అందుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ జానీ.

మరోవైపు ఆయన ప్రచారం చేసిన జనసేన పార్టీ కూడా ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో తన సంతోషానికి అవధుల్లేకపోయాయి. ఇలా అన్నీ కలిసి వస్తున్న సమయంలో ఆయన మాజీ అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, పెట్టిన కేసుతో జానీ జీవితం తల్లకిందులైపోయింది.

జానీ బాగా అన్ పాపులర్ కావడమే కాదు.. అరెస్టయి జైలుకు వెళ్లాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జానీకి వెంటనే బెయిల్ కూడా లభించలేదు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం మధ్యంతర బెయిల్ పొందితే.. ఆ అవార్డునే క్యాన్సిల్ చేశారు. మళ్లీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది.

ఐతే ఎట్టకేలకు జానీ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీంతో జానీ మద్దతుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకసారి బెయిల్ వచ్చిందంటే ఇక ఈ కేసులో పోరాటం తేలికవుతుందని జానీ భావిస్తున్నాడు. కాగా ఈ కేసులో చిక్కుకున్నాక జానీ ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడింది లేదు.

తనపై ఆరోపణలు రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత అరెస్టయి జైలుకు వెళ్లాడు. దీంతో తన వెర్షన్ ఏంటన్నదే మీడియాకు తెలియలేదు. పోలీసుల విచారణలో తాను తప్పు చేసినట్లు జానీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అదెంత వరకు నిజమో తెలియదు.

ఈ నేపథ్యంలో జానీ బయటికి వచ్చి స్థిమిత పడ్డాక కొన్ని రోజుల్లో మీడియాను కలవబోతున్నట్లు సమాచారం. ఈ కేసు విషయంలో తన వెర్షన్ అతను వినిపించబోతున్నాడట. తన లాయర్‌తో సంప్రదించి, అన్నీ ఆలోచించుకుని మీడియాతో జాగ్రత్తగా మాట్లాడేలా ప్లాన్ చేసుకుని రాబోతున్నట్లు తెలిసింది.

Satya

Recent Posts

ప్రమాదంపై రాజకీయాలేల బాసూ…!

ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…

2 hours ago

పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…

3 hours ago

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం

ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…

3 hours ago

ఇండియా కూటమి మీటింగ్‌కు విజయ్ దూరం.. కారణాలివే!

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…

4 hours ago

మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు…

5 hours ago

తమన్ జేబులో ఎనిమిది సినిమాలు

ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…

6 hours ago