ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక సంగీత దర్శకుడి ప్యాన్ ఇండియా మూవీ మూడు నెలలకు ఒకటి విడుదల కావడమే గగనమైపోయింది. అలాంటిది కేవలం ఇరవై రోజుల వ్యవధిలో రెండు అతి పెద్ద క్రేజీ సినిమాలు రిలీజంటే ఎవరికైనా అది ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఆ ఘనతను అందుకోబోతున్నాడు. నవంబర్ 14 రాబోతున్న కంగువకి ఏకంగా కోలీవుడ్ బాహుబలి రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సూర్యతో పాటు టీమ్ మొత్తం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ పక్కనపెడితే ఆరవ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ చూడని అతి పెద్ద నెంబర్లు నమోదు కావడం ఖాయమని అంటున్నారు.
తమిళంలో ఇప్పటిదాకా బోలెడు ఆల్బమ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ కు అవన్నీ ఒక ఎత్తు అయితే కంగువ మాత్రం ఇంకోవైపు నిలుస్తుంది. ఇది కనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన పేరు మరోసారి జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతుంది.
అనిరుధ్ రవిచందర్ రాజ్యమేలుతున్న గడ్డ మీద ముద్ర వేయడానికి దేవికి ఇంతకన్నా ఛాన్స్ దొరకదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నమ్మకం నిలబెట్టుకుంటే చాలు. ఇక డిసెంబర్ 5 పుష్ప 2 ది రూల్ దిగేస్తాడు. వెయ్యి కోట్లకు పైగా టోటల్ బిజినెస్ తో ఇప్పటికే అల్లు అర్జున్ రేపుతున్న ప్రకంపనలు ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారాయి.
కంగువ, పుష్ప 2 రెండు కనక విజయవంతమైతే దేవి బ్యాక్ టు ట్రాక్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. తమన్ హవాలో కొంచెం వెనుకబడినట్టు అనిపించినా తనదైన రోజు చెలరేగిపోయే ఈ మిస్టర్ బ్యాచిలర్ కు వచ్చే ఏడాది ఎలాగూ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి.
కాకపోతే అందరిలాగా వేగంగా వచ్చిన ఆఫర్లు ఒప్పుకోకుండా స్లోగా ఉన్న దేవి ఇకనైనా స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది జరగాలంటే సూర్య, అల్లు అర్జున్ ను బీజీఎమ్, సాంగ్స్ తో ఎలివేట్ చేస్తే చాలు. పోలిక ప్రకారం చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన పాటల్లో కంగువ కన్నా పుష్ప ఆడియోనే ఎక్కువ ఛార్ట్ బస్టరయ్యింది.
This post was last modified on %s = human-readable time difference 6:05 pm
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…
గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె…