2016లో విడుదలైన దంగల్ హీరో అమీర్ ఖాన్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పొచ్చు. కమర్షియల్ మూసలకు దూరంగా ఒక రియల్ లైఫ్ బయోపిక్ తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చి పెట్టింది. జపాన్, చైనా లాంటి దేశాల్లోని ప్రేక్షకులను సైతం ఎమోషన్ కు గురి చేసిందంటే ఇందులో భావోద్వేగాలు ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత దంగల్ మీద పలు ఆరోపణలు రావడం విచిత్రం. ఈ సినిమా పేరొందిన కుస్తీ పహిల్వాన్ మహావీర్ ఫోగట్ తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్ళ విజయాల ఆధారంగా తీసిన విషయం తెలిసిందే.
తాజాగా మహవీర్ తనయలో ఒకరైన బబిత ఫోగాట్ కొన్ని సంచలనాత్మక విషయాలు పంచుకున్నారు. 2010లో ఒక జర్నలిస్టు వీళ్ళ కుటుంబాన్ని సంప్రదించి ఈ ఫ్యామిలీ విజయ గాధని పేపర్లో ప్రచురించాడు. దీన్ని చదివిన దర్శకుడు నితేశ్ తివారి ఒక డాక్యుమెంటరీ తీస్తానని చెప్పి మహావీర్, బబిత, కవితలను కలిశాడు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వచ్చి మొత్తం చదివి వినిపిస్తే అందరూ కదిలిపోయారు. పేర్లు మారుస్తానంటే మహావీర్ ఒప్పుకోకపోవడంతో అలాగే ఉంచేశారు. కట్ చేస్తే వరల్డ్ లెవెల్ లో దంగల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రాయల్టి రూపంలో మహావీర్ ఫ్యామిలీకి ఇచ్చిన మొత్తం కేవలం కోటి రూపాయలేనట.
స్వంత గ్రామంలో అకాడెమి ఏర్పాటు కోసం మహావీర్ అమీర్ ఖాన్ ను కలిశాడు. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ ని సంప్రదించాడు. మొత్తం అయిదు కోట్ల దాకా అవుతుందని విన్నవించాడు. కానీ దానికి దంగల్ బృందం రియాక్ట్ అవ్వలేదు. పలుమార్లు తిరిగి ఇక పనవ్వదని గుర్తించి అక్కడితో వదిలేశారు. రెండు వేల కోట్లు వసూలు చేస్తే కేవలం కోటి ఇవ్వడం ఏమిటన్న బబిత కామెంట్స్ వైరలవుతున్నాయి. రన్బీర్ కపూర్ తో వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు నితేశ్ తివారి సినిమా తీస్తున్న టైంలో ఇలాంటి కాంట్రావర్సి రావడం గమనార్హం. ఏదైనా మతలబు ఉందేమో.
This post was last modified on October 23, 2024 5:46 pm
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…