దక్షిణాదిన గొప్ప నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలూ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది నిత్య. ఐతే ఆమె గతంలో ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలు చేసినా.. వాటిని కాదని ‘తిరు’ అనే మామూలు సినిమాకు ఆమెకు జాతీయ పురస్కారం దక్కింది. ‘తిరు’ లాంటి సగటు కమర్షియల్ సినిమాలో పాత్రకు జాతీయ అవార్డు ఏంటి అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఐతే అవార్డులు ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఆ విషయంలో తాను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నానని నిత్య చెప్పింది.
“అవును. ఇప్పటికీ నాకు వచ్చిన జాతీయ అవార్డు గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఐతే జ్యూరీ సభ్యులు నాకు ఎందుకీ అవార్డు ఇచ్చారో వాళ్లను కలిశాకే అర్థమైంది. నాకు అవార్డును ప్రకటించాక జ్యూరీ సభ్యుల్లో కొందరిని కలిశాను. అప్పుడే తెలిసింది.. వాళ్లు కేవలం ఈ ఒక్క సినిమా కోసం నాకు అవార్డు ఇవ్వలేదని. నాలో ఉన్న కళాకారిణిని, నా కెరీర్ను చూసి ఈ వార్డు ఇచ్చారని. అందుకే ఈ అవార్డును చాలా గొప్పగా భావిస్తాను” అని నిత్య వెల్లడించింది.
తన లుక్స్ విషయంలో కూడా తరచుగా తాను విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటానని నిత్య తెలిపింది. తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని.. కొన్ని సినిమాల్లో తాను ఇలాగే కనిపించాలని చెబుతుంటారని.. వాటికి తాను ఎప్పుడూ లొంగలేదని నిత్య చెప్పింది. ‘మీరు బరువు పెరిగారు’ అనే కామెంట్ను తాను తరచుగా వింటూ ఉంటానని.. మనస్ఫూర్తిగా అభినందించే వాళ్లు తక్కువ అని నిత్య ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా పాత్ర ఎంచుకునేటపుడు అందుకు తాను నప్పుతానా అనేది మాత్రమే చూస్తానని.. సినిమా రిజల్ట్ గురించి ఆలోచించని.. కథ అర్థం కాకపోతే ఏ సినిమాలోనూ నటించనని నిత్య స్పష్టం చేసింది.
This post was last modified on October 23, 2024 10:26 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…