దక్షిణాదిన గొప్ప నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలూ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది నిత్య. ఐతే ఆమె గతంలో ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలు చేసినా.. వాటిని కాదని ‘తిరు’ అనే మామూలు సినిమాకు ఆమెకు జాతీయ పురస్కారం దక్కింది. ‘తిరు’ లాంటి సగటు కమర్షియల్ సినిమాలో పాత్రకు జాతీయ అవార్డు ఏంటి అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఐతే అవార్డులు ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఆ విషయంలో తాను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నానని నిత్య చెప్పింది.
“అవును. ఇప్పటికీ నాకు వచ్చిన జాతీయ అవార్డు గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఐతే జ్యూరీ సభ్యులు నాకు ఎందుకీ అవార్డు ఇచ్చారో వాళ్లను కలిశాకే అర్థమైంది. నాకు అవార్డును ప్రకటించాక జ్యూరీ సభ్యుల్లో కొందరిని కలిశాను. అప్పుడే తెలిసింది.. వాళ్లు కేవలం ఈ ఒక్క సినిమా కోసం నాకు అవార్డు ఇవ్వలేదని. నాలో ఉన్న కళాకారిణిని, నా కెరీర్ను చూసి ఈ వార్డు ఇచ్చారని. అందుకే ఈ అవార్డును చాలా గొప్పగా భావిస్తాను” అని నిత్య వెల్లడించింది.
తన లుక్స్ విషయంలో కూడా తరచుగా తాను విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటానని నిత్య తెలిపింది. తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని.. కొన్ని సినిమాల్లో తాను ఇలాగే కనిపించాలని చెబుతుంటారని.. వాటికి తాను ఎప్పుడూ లొంగలేదని నిత్య చెప్పింది. ‘మీరు బరువు పెరిగారు’ అనే కామెంట్ను తాను తరచుగా వింటూ ఉంటానని.. మనస్ఫూర్తిగా అభినందించే వాళ్లు తక్కువ అని నిత్య ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా పాత్ర ఎంచుకునేటపుడు అందుకు తాను నప్పుతానా అనేది మాత్రమే చూస్తానని.. సినిమా రిజల్ట్ గురించి ఆలోచించని.. కథ అర్థం కాకపోతే ఏ సినిమాలోనూ నటించనని నిత్య స్పష్టం చేసింది.
This post was last modified on October 23, 2024 10:26 am
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…
తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…