దక్షిణాదిన గొప్ప నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలూ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది నిత్య. ఐతే ఆమె గతంలో ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలు చేసినా.. వాటిని కాదని ‘తిరు’ అనే మామూలు సినిమాకు ఆమెకు జాతీయ పురస్కారం దక్కింది. ‘తిరు’ లాంటి సగటు కమర్షియల్ సినిమాలో పాత్రకు జాతీయ అవార్డు ఏంటి అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఐతే అవార్డులు ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఆ విషయంలో తాను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నానని నిత్య చెప్పింది.
“అవును. ఇప్పటికీ నాకు వచ్చిన జాతీయ అవార్డు గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఐతే జ్యూరీ సభ్యులు నాకు ఎందుకీ అవార్డు ఇచ్చారో వాళ్లను కలిశాకే అర్థమైంది. నాకు అవార్డును ప్రకటించాక జ్యూరీ సభ్యుల్లో కొందరిని కలిశాను. అప్పుడే తెలిసింది.. వాళ్లు కేవలం ఈ ఒక్క సినిమా కోసం నాకు అవార్డు ఇవ్వలేదని. నాలో ఉన్న కళాకారిణిని, నా కెరీర్ను చూసి ఈ వార్డు ఇచ్చారని. అందుకే ఈ అవార్డును చాలా గొప్పగా భావిస్తాను” అని నిత్య వెల్లడించింది.
తన లుక్స్ విషయంలో కూడా తరచుగా తాను విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటానని నిత్య తెలిపింది. తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని.. కొన్ని సినిమాల్లో తాను ఇలాగే కనిపించాలని చెబుతుంటారని.. వాటికి తాను ఎప్పుడూ లొంగలేదని నిత్య చెప్పింది. ‘మీరు బరువు పెరిగారు’ అనే కామెంట్ను తాను తరచుగా వింటూ ఉంటానని.. మనస్ఫూర్తిగా అభినందించే వాళ్లు తక్కువ అని నిత్య ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా పాత్ర ఎంచుకునేటపుడు అందుకు తాను నప్పుతానా అనేది మాత్రమే చూస్తానని.. సినిమా రిజల్ట్ గురించి ఆలోచించని.. కథ అర్థం కాకపోతే ఏ సినిమాలోనూ నటించనని నిత్య స్పష్టం చేసింది.
This post was last modified on October 23, 2024 10:26 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…