దీపావళికి స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా కంటెంట్ నమ్ముకున్న విభిన్న చిత్రాలు పోటీలో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, కిరణ్ అబ్బవరంలు విభిన్న ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వీళ్లకు తోడుగా కాంపిటీషన్ లో శివ కార్తికేయన్ ఉన్నాడు. అమరన్ కూడా అక్టోబర్ 31నే లక్కీ భాస్కర్, ‘క’తో పాటుగా రిలీజవుతోంది. ఇప్పటికైతే తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి సౌండ్ లేదు. రేపు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. సాయిపల్లవి హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లో తనకున్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకోకుండా తెలుగు వెర్షన్ ప్రమోషన్లు ఇంకా మొదలుపెట్టలేదు.
టైటిల్ కూడా వేట్టయన్ దారిలో అమరన్ అని యధాతథంగా ఉంచేశారు. తెలుగు ఆడియన్స్ సౌలభ్యం కోసమైనా పేర్లు మార్చే ఉద్దేశంలో తమిళ నిర్మాతలు కనిపించడం లేదు. పోనీ ఇక్కడ హక్కులు కొన్న వాళ్ళు ఏమైనా సలహా ఇవ్వడమో ఒత్తిడి చేయడమో చేస్తారా అంటే అదీ లేదు. అడిగితే ప్యాన్ ఇండియా సినిమాలకు బాషా హద్దులు ఉండవని అంటారు. మరి కార్తీ మూవీకి సత్యం సుందరం అని ఎందుకు మార్చారో ఎవరూ చెప్పలేరు. దీని సంగతి పక్కనపెడితే అమరన్ ఫోకస్ తమిళనాడు మీదే ఎక్కువగా ఉంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజజీవిత కథ ఆధారంగా రూపొందింది.
కమల్ హాసన్ దీనికి నిర్మాణ భాగస్వామ్యం వహించగా రాజకుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్ తెలుగు పబ్లిసిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు. డాక్టర్, డాన్ ఇక్కడ కమర్షియల్ గా సక్సెస్ కాగా ప్రిన్స్ నిరాశపరిచింది. మహావీరుడు పర్వాలేదనిపించింది. అయలాన్ మాత్రం సాంకేతిక కారణాల వల్ల డబ్బింగ్ జరగకుండానే ఆగిపోయింది. తిరిగి ఇంత గ్యాప్ తో అమరన్ తో వస్తున్నాడు. విజయ్, సూర్య అంత మార్కెట్ ఇక్కడ లేదు కానీ కంటెంట్ బాగుంటే జనం హిట్ ఇస్తారు కాబట్టి టాక్ నే నమ్ముకున్నాడు. లక్కీ భాస్కర్ కంపోజ్ చేసిన జివి ప్రకాష్ కుమార్ దీనికీ సంగీతం అందించాడు.
This post was last modified on October 22, 2024 5:59 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…