సూపర్ స్టార్ రజనీకాంత్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కు కొనసాగింపుగా పార్ట్ 2 తాలూకు స్క్రిప్ట్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సిద్ధం చేస్తున్నారు. కూలి షూటింగ్ లో తలైవర్ బిజీగా ఉన్న కారణంగా ఇంకా బోలెడు టైం ఉండటంతో తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే వెంటనే ఉంటుందా లేక టైం పడుతుందా అనేది తెలియదు కానీ నెల్సన్ మాత్రం జైలర్ 2 తో పాటు వేరే కథలు సిద్ధం చేసుకుని ఇతర స్టార్లను కలుసుకునే ప్లాన్లతో వర్కౌట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మీటింగ్ అయ్యిందనే టాక్ ఉంది కానీ ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ఇక జైలర్ 2 ఒక అరుదైన కలయికకు శ్రీకారం చుట్టబోతోందని తెలిసింది. మామ అల్లుడు ఇందులో భాగం కాబోతున్నారట. అంటే రజనీకాంత్, ధనుష్ కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారని చెన్నై న్యూస్. అదిరిపోయే క్యామియోలు చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ను కొనసాగిస్తూనే ధనుష్ కోసం ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.
మొదటి భాగంలో కొడుకు చనిపోతాడు కాబట్టి వేరే సంతానం లేని జైలర్ కు మరో అండ అవసరం. ఆ క్యారెక్టర్ లోనే ధనుష్ ఎంట్రీ ఉంటుందని, పూర్తి పాజిటివ్ సైడ్ లో మరిన్ని ఎలివేషన్లతో విజిల్స్ వేయించే రేంజ్ లో ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.
నిజానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయాక తిరిగి కలుసుకునే దాఖలాలు కనిపించలేదు. అలాని రజనికి అల్లుడి మీద ఎలాంటి కోపం లేదని పలు సందర్భాల్లో బయట పడింది. అందుకే జైలర్ 2 కోసం ఇలా అనుకుంటున్నానని నెల్సన్ చెప్పగానే ఓకే అన్నారట. కూలి షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాక కొంత అస్వస్థతకు గురైన రజనీకాంత్ తిరిగి మాములు స్థితికి వచ్చేశారు.
ఈ నెలలోనే బ్యాలన్స్ పూర్తి చేస్తారు. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ తగ్గించే సమస్యే లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులకు చెబుతున్నారట. అంతేమరి నటనకు అలవాటు పడిన ప్రాణం విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది.
This post was last modified on October 22, 2024 3:39 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…