సూపర్ స్టార్ రజనీకాంత్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కు కొనసాగింపుగా పార్ట్ 2 తాలూకు స్క్రిప్ట్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సిద్ధం చేస్తున్నారు. కూలి షూటింగ్ లో తలైవర్ బిజీగా ఉన్న కారణంగా ఇంకా బోలెడు టైం ఉండటంతో తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే వెంటనే ఉంటుందా లేక టైం పడుతుందా అనేది తెలియదు కానీ నెల్సన్ మాత్రం జైలర్ 2 తో పాటు వేరే కథలు సిద్ధం చేసుకుని ఇతర స్టార్లను కలుసుకునే ప్లాన్లతో వర్కౌట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మీటింగ్ అయ్యిందనే టాక్ ఉంది కానీ ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ఇక జైలర్ 2 ఒక అరుదైన కలయికకు శ్రీకారం చుట్టబోతోందని తెలిసింది. మామ అల్లుడు ఇందులో భాగం కాబోతున్నారట. అంటే రజనీకాంత్, ధనుష్ కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారని చెన్నై న్యూస్. అదిరిపోయే క్యామియోలు చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ను కొనసాగిస్తూనే ధనుష్ కోసం ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.
మొదటి భాగంలో కొడుకు చనిపోతాడు కాబట్టి వేరే సంతానం లేని జైలర్ కు మరో అండ అవసరం. ఆ క్యారెక్టర్ లోనే ధనుష్ ఎంట్రీ ఉంటుందని, పూర్తి పాజిటివ్ సైడ్ లో మరిన్ని ఎలివేషన్లతో విజిల్స్ వేయించే రేంజ్ లో ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.
నిజానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయాక తిరిగి కలుసుకునే దాఖలాలు కనిపించలేదు. అలాని రజనికి అల్లుడి మీద ఎలాంటి కోపం లేదని పలు సందర్భాల్లో బయట పడింది. అందుకే జైలర్ 2 కోసం ఇలా అనుకుంటున్నానని నెల్సన్ చెప్పగానే ఓకే అన్నారట. కూలి షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాక కొంత అస్వస్థతకు గురైన రజనీకాంత్ తిరిగి మాములు స్థితికి వచ్చేశారు.
ఈ నెలలోనే బ్యాలన్స్ పూర్తి చేస్తారు. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ తగ్గించే సమస్యే లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులకు చెబుతున్నారట. అంతేమరి నటనకు అలవాటు పడిన ప్రాణం విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది.
This post was last modified on October 22, 2024 3:39 pm
దీపావళికి స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా కంటెంట్ నమ్ముకున్న విభిన్న చిత్రాలు పోటీలో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, కిరణ్ అబ్బవరంలు…
వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్..ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ…
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా…
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి…
బ్లాక్ బస్టర్ ఓటిటి టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ శుక్రవారం మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. తొలి…
ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే..…