సూపర్ స్టార్ రజనీకాంత్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కు కొనసాగింపుగా పార్ట్ 2 తాలూకు స్క్రిప్ట్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సిద్ధం చేస్తున్నారు. కూలి షూటింగ్ లో తలైవర్ బిజీగా ఉన్న కారణంగా ఇంకా బోలెడు టైం ఉండటంతో తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే వెంటనే ఉంటుందా లేక టైం పడుతుందా అనేది తెలియదు కానీ నెల్సన్ మాత్రం జైలర్ 2 తో పాటు వేరే కథలు సిద్ధం చేసుకుని ఇతర స్టార్లను కలుసుకునే ప్లాన్లతో వర్కౌట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మీటింగ్ అయ్యిందనే టాక్ ఉంది కానీ ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ఇక జైలర్ 2 ఒక అరుదైన కలయికకు శ్రీకారం చుట్టబోతోందని తెలిసింది. మామ అల్లుడు ఇందులో భాగం కాబోతున్నారట. అంటే రజనీకాంత్, ధనుష్ కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారని చెన్నై న్యూస్. అదిరిపోయే క్యామియోలు చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ను కొనసాగిస్తూనే ధనుష్ కోసం ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.
మొదటి భాగంలో కొడుకు చనిపోతాడు కాబట్టి వేరే సంతానం లేని జైలర్ కు మరో అండ అవసరం. ఆ క్యారెక్టర్ లోనే ధనుష్ ఎంట్రీ ఉంటుందని, పూర్తి పాజిటివ్ సైడ్ లో మరిన్ని ఎలివేషన్లతో విజిల్స్ వేయించే రేంజ్ లో ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.
నిజానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయాక తిరిగి కలుసుకునే దాఖలాలు కనిపించలేదు. అలాని రజనికి అల్లుడి మీద ఎలాంటి కోపం లేదని పలు సందర్భాల్లో బయట పడింది. అందుకే జైలర్ 2 కోసం ఇలా అనుకుంటున్నానని నెల్సన్ చెప్పగానే ఓకే అన్నారట. కూలి షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాక కొంత అస్వస్థతకు గురైన రజనీకాంత్ తిరిగి మాములు స్థితికి వచ్చేశారు.
ఈ నెలలోనే బ్యాలన్స్ పూర్తి చేస్తారు. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ తగ్గించే సమస్యే లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులకు చెబుతున్నారట. అంతేమరి నటనకు అలవాటు పడిన ప్రాణం విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది.
This post was last modified on October 22, 2024 3:39 pm
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…