బ్లాక్ బస్టర్ ఓటిటి టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ శుక్రవారం మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని తీసుకురావడం అంచనాలు పెంచింది. సీఎం అయ్యాక ఒక టీవీ షో కెమెరా ముందుకు బాబు రావడం ఇదే మొదటిసారి. గతంలోనే ఈ కలయిక జరిగినప్పటికీ ఈసారి విజేతలుగా బావా బావమరిది సంభాషణ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. దానికి మరింత స్పష్టత ఇచ్చేందుకు ఆహా టీమ్ ప్రత్యేకంగా 5 నిమిషాల కొత్త ట్రైలర్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టే బాలయ్య, బాబుల మధ్య బోలెడు ముచ్చట్లు ఉన్నాయని అర్థమైపోయింది.
ఊహించినట్టే చంద్రబాబు యాభై రోజులకు పైగా జైల్లో గడిపిన సంఘటన తాలూకు చర్చ ఇద్దరి మధ్య ఎమోషనల్ గా సాగింది. పవన్ కళ్యాణ్ వచ్చి కలిశాక జైలు గోడల మధ్య జరిగిన సమావేశం తాలూకు వివరాలు కూడా బాలయ్య ఈ సందర్భంగా అడిగేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రస్తావనతో పాటు మనవడు దేవాన్ష్ తో బాబు చిన్నప్పుడు చేసిన ఏదైనా అల్లరి ఘటన గురించి అడిగే వీడియో కూడా ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు ఒక అయిదు వందల రూపాయలు షాపింగ్ కోసమని చంద్రబాబుకి ఇస్తే సూపర్ మార్కెట్ కి వెళ్లి ఏం కొంటారనే వైరెటీ ఐడియాని ఎపిసోడ్లో అమలుపరిచారు. సరదా సెటైర్లు కూడా పడ్డాయి.
ఇవి చాలవు అన్నట్టు కొన్ని రొమాంటిక్ సినిమాల ముచ్చట్లు బాబు, బాలయ్య మధ్య దొర్లాయి. కాంబో రిపీట్ అయినా సరే ఖచ్చితంగా చూడాలన్న ఇంటరెస్ట్ రప్పించడంలో ఆహా బృందం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. నాలుగో సీజన్ మొదటి భాగం కావడంతో హైప్ బాగా ఉంది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులతో పాటు బాలయ్య, పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ తో వ్యూస్ భారీ ఎత్తున వచ్చేలా ఉన్నాయి. ఇది కేవలం సాంపిల్ కాబట్టి కొన్నే చూపించారు కానీ అసలు కంటెంట్ దాచే ఉంటారు. ఇదే టెంపో టాక్ షో మొత్తం కొనసాగి ఉంటే మాత్రం మరో సూపర్ హిట్ సీజన్ బాలయ్య ఖాతాలో పడినట్టే.
This post was last modified on October 22, 2024 2:25 pm
దీపావళికి స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా కంటెంట్ నమ్ముకున్న విభిన్న చిత్రాలు పోటీలో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, కిరణ్ అబ్బవరంలు…
వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్..ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ…
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా…
సూపర్ స్టార్ రజనీకాంత్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కు కొనసాగింపుగా పార్ట్ 2 తాలూకు…
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి…
ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే..…