విడుదల తేదీ డిసెంబర్ 6 దగ్గరపడే కొద్దీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలలో పుష్ప 2 ది రూల్ గురించిన అంచనాలు అంతకంతా పెరుగుతూ పోతున్నాయి తప్పించి ఇంచు కూడా తగ్గడం లేదు. ట్రైలర్ రాలేదు. ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. ఒకటి రెండు విజువల్స్, పోస్టర్స్ తప్ప అసలైన కంటెంట్ వదల్లేదు. అయినా సరే పుష్ప 2 మాత్రం తగ్గేదేలే అంటూ అరాచకం చూపిస్తున్నాడు. మొదటి భాగం వచ్చిన టైంలో హిందీ వెర్షన్ యూట్యూబ్ లేదా శాటిలైట్ లో వస్తే చాలన్న బాలీవుడ్ నిర్మాత మాటను తప్పని రుజువు చేయడం దగ్గరి నుంచి ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ కోసం కొట్టుకునేలా చేయడం బన్నీకే చెల్లింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే పుష్ప 2 వెయ్యి కోట్ల మార్కు దాటిందనే వార్త ఇప్పుడు దావానలంలా ఆన్ లైన్, మీడియాని ఊపేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా లీకవుతున్న సోర్స్ నుంచి వస్తున్న నెంబర్లు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఏపీ తెలంగాణ కలిపి రెండు తెలుగు రాష్ట్రాలకు సుమారు 220 కోట్ల దాకా బిజినెస్ అయ్యిందనే టాక్ ఇప్పటికే తెలిసిన విషయమే. ఇతర లెక్కలు చూస్తే నార్త్ వెర్షన్ 200 కోట్లు, తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ 120 కోట్లు దాకా థియేటర్ హక్కుల రూపంలో సమకూరినట్టు ట్రేడ్ టాక్. మొత్తం 640 కోట్ల దాకా తేలుతుంది.
నాన్ థియేట్రికల్ చూసుకుంటే ఓటిటి 275 కోట్లు, మ్యూజిక్ ఆల్బమ్ 65 కోట్లు, శాటిలైట్ అన్ని భాషలు కలిపి 85 కోట్ల దాకా అయ్యిందట. టోటల్ లెక్క చూసుకుంటే 1065 కోట్ల దాకా ఉంది. ఇవి ఖచ్చితమైన వాస్తవాలని చెప్పలేం కానీ క్రేజ్ దృష్ట్యా చూస్తుంటే నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. కల్కి 2898 ఏడి, దేవరకు ఇతర భాషల్లో ఎప్పుడూ చూడనంత డిమాండ్ ఏర్పడలేదు. కానీ పుష్పకు అలా కాదు. హిందీ, మలయాళంలోనూ విపరీతమైన హైప్ ఉంది. ఇదంతా చూస్తుంటే సహస్ర కోట్లను మంచినీళ్లలా తాగేసిన పుష్ప అంత మొత్తం బాక్సాఫీస్ దగ్గర రాబడితే మాత్రం కనివిని ఎరుగని సంచలనమే అవుతుంది.
This post was last modified on October 22, 2024 11:18 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…