Movie News

కిచ్చా సుదీప్ కుమార్తె ఆవేదన

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. వాళ్ల ఇళ్లలో ఏం జరిగినా వార్తే. వాళ్ల పట్ల జనాల్లో ఉండే క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవడానికి మీడియా, సోషల్ మీడియా జనాలు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన సమయంలో కూడా సున్నితత్వం కోల్పోయి ప్రవర్తించడమే దారుణం. ముఖ్యంగా సెలబ్రెటీలు తమకు ఎంతో ముఖ్యమైన కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నపుడు మీడియా, సోషల్ మీడియా జనాలు కవరేజీ కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారుతుంటాయి.

తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన తల్లిని కోల్పోయిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్ పెద్ద ఎత్తున గుమిగూడారు. వీడియోల కోసం పోటీ పడ్డారు. రీల్స్ చేసుకునే మామూలు జనాలు కూడా శ్రుతి మించి ప్రవర్తించారు.

ఈ విషయమై కిచ్చా సుదీప్ కుమార్తె శాన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇంటి వద్ద వీడియోల కోసం జనం హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల తన నాయనమ్మకు సరైన వీడ్కోలు కూడా ఇవ్వలేకపోయానని ఆమె పోస్ట్ పెట్టింది. “నాయనమ్మను కోల్పోయిన దు:ఖంలో నేనుంటే కొందరు వ్యక్తులు నా ముఖం మీద కెమెరాలు పెట్టారు. బాధలో ఉన్న వ్యక్తితో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారని నాకు ఇప్పటి వరకు తెలయిదు. వారి కారణంలో నేను నా నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వాళ్లు ఇలాగే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే జనాలు నెట్టేశారు. కొందరు ఆయన మీద పడి లాగడం మొదలుపెట్టారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. వారికి రీల్స్ మీద ఉన్న శ్రద్ధ మరొకరి ఎమోషన్లను అర్థం చేసుకోవడంలో లేదు” అని శాన్వి ఆవేదన వ్కక్తం చేసింది.

కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అమ్మకు నివాళిగా తీవ్ర భావోద్వేగంతో సుదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

This post was last modified on October 21, 2024 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

1 hour ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago