సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. వాళ్ల ఇళ్లలో ఏం జరిగినా వార్తే. వాళ్ల పట్ల జనాల్లో ఉండే క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవడానికి మీడియా, సోషల్ మీడియా జనాలు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన సమయంలో కూడా సున్నితత్వం కోల్పోయి ప్రవర్తించడమే దారుణం. ముఖ్యంగా సెలబ్రెటీలు తమకు ఎంతో ముఖ్యమైన కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నపుడు మీడియా, సోషల్ మీడియా జనాలు కవరేజీ కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారుతుంటాయి.
తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన తల్లిని కోల్పోయిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెర్స్ పెద్ద ఎత్తున గుమిగూడారు. వీడియోల కోసం పోటీ పడ్డారు. రీల్స్ చేసుకునే మామూలు జనాలు కూడా శ్రుతి మించి ప్రవర్తించారు.
ఈ విషయమై కిచ్చా సుదీప్ కుమార్తె శాన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇంటి వద్ద వీడియోల కోసం జనం హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల తన నాయనమ్మకు సరైన వీడ్కోలు కూడా ఇవ్వలేకపోయానని ఆమె పోస్ట్ పెట్టింది. “నాయనమ్మను కోల్పోయిన దు:ఖంలో నేనుంటే కొందరు వ్యక్తులు నా ముఖం మీద కెమెరాలు పెట్టారు. బాధలో ఉన్న వ్యక్తితో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారని నాకు ఇప్పటి వరకు తెలయిదు. వారి కారణంలో నేను నా నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వాళ్లు ఇలాగే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే జనాలు నెట్టేశారు. కొందరు ఆయన మీద పడి లాగడం మొదలుపెట్టారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. వారికి రీల్స్ మీద ఉన్న శ్రద్ధ మరొకరి ఎమోషన్లను అర్థం చేసుకోవడంలో లేదు” అని శాన్వి ఆవేదన వ్కక్తం చేసింది.
కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అమ్మకు నివాళిగా తీవ్ర భావోద్వేగంతో సుదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
This post was last modified on October 21, 2024 3:55 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…