ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్రాంజైజీ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది.
ఆ తర్వాత హిరాని ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘనవిజయం సాధించింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ తీయాలని హిరాని-సంజు ఎప్పుడో అనుకున్నారు. కానీ అది ఎంతకీ పట్టాలెక్కడం లేదు.
ఐతే ఎట్టకేలకు హిరాని మున్నాభాయ్-3 తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన తర్వాతి చిత్రం అదే కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చాడు. అంతే కాక ‘మున్నాభాయ్-3’ కోసం ఐదు వేర్వేరు స్క్రిప్టుల మీద పని చేసినట్లు హిరాని వెల్లడించడం విశేషం.
‘మున్నాభాయ్ ఛలే అమెరికా’ పేరుతో పార్ట్-3 తీయబోతున్నట్లు హిరాని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో పాటుగా తాను మరో నాలుగు స్క్రిప్టుల మీద పని చేశానని.. అవన్నీ కూడా సగం సగమే పూర్తయ్యాయని.. ఏదీ పూర్తి రూపం సంతరించుకోలేదని హిరాని వెల్లడించాడు.
ఇప్పుడు ఆ ఐదు స్క్రిప్టుల్లో ఒకటి ఎంచుకుని దాని మీద పూర్తి చేయాలని చూస్తున్నట్లు హిరాని తెలిపాడు. మున్నాభాయ్-3.. తొలి రెండు సినిమాల కంటే చాలా మెరుగ్గా ఉండాలన్నది తన లక్ష్యమని.. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నానని హిరాని తెలిపాడు.
సంజు త్వరలో తన దగ్గరికి వచ్చి స్క్రిప్టు త్వరగా పూర్తి చేయమని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలున్నట్లు హిరాని చమత్కరించాడు. ఈ సినిమా గురించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన హిరాని.. ఆ తర్వాత లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి బ్లాక్ బస్టర్లు తీశారు. ఆయన చివరి చిత్రం ‘డంకి’ మాత్రం ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది.
This post was last modified on October 20, 2024 4:38 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…