ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు పెద్దరికంతో ఆవిడ హుందాగా కనిపిస్తున్నారు.
దానికి తగ్గట్టే ఆఫర్లు వస్తున్నాయట. అయితే జరీనా వహాబ్ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. ఆవిడ స్వస్థలం విశాఖపట్నం. పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ లో శిక్షణ పొందాక బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. 1974లో తొలిసారి హీరోయిన్ గా నటించారు.
లెజెండరీ నటులు రాజ్ కపూర్ ఆమె నటన, లుక్స్ మీద ఇచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ సీరియస్ గా తీసుకున్న జరీనా వహాబ్ తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. 1976లో బసు ఛటర్జీ తీసిన చిత్ చోర్ లో తొలి బ్రేక్ అందుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
1986లో నటుడు ఆదిత్య పంచోలిని పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గాజుల కిష్టయ్యతో 1975లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్ అమర ప్రేమలో చేశారు. అక్కినేని-కృష్ణ మల్టీస్టారర్ హేమాహేమీ తర్వాత జరీనా వహాబ్ పూర్తిగా హిందీ, మలయాళం సినిమాలకు అంకితమయ్యారు.
2010 రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రతో మళ్ళీ కనిపించారు. రక్త చరిత్ర 2 వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెతికి మరీ ఆవిడను నాని దసరాతో రీ ఎంట్రీ చేయించాడు. జూనియర్ ఎన్టీఆర్ దేవరలోనూ మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులు యాడ్ అయ్యాయి. తెలుగు బాగా మాట్లాడ్డం వచ్చు కాబట్టే అంత సహజమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నారట. ఫలితాల సంగతి పక్కనపెడితే ఈ రెండు సినిమాల్లోనూ జరీనా వహాబ్ పాత్ర బాగా ప్లస్ అయ్యింది. మెల్లగా నాన్నమ్మ, అమ్మ క్యారెక్టర్లకు ఈవిడ మంచి ఛాయస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on January 13, 2026 10:19 am
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…