రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎవరు ఏమనుకున్నా.. తాము ప్రజల అభిప్రాయాలు, వారి అభిరుచుల మేరకు.. మార్పులు చేర్పులు చేయాలని సంకల్పించామన్నారు. ముఖ్యంగా పాలనకు అనుకూలంగా లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో అభివృద్ధి ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మార్పులు చేస్తామని తేల్చి చెప్పారు.
జిల్లాల విభజనతోనే.. అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు సహా కొన్ని జిల్లాల సరిహద్దులు మార్చాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని సీఎం తెలిపారు. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.
త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. ప్రజల నుంచి మరోసారి అభిప్రాయాలు సేకరిస్తుందని.. దాని ప్రకారం జిల్లాల విభజనను చేపట్టనున్నట్టు వెల్లడించారు.
అనంతరం జిల్లాల విభజనపై ముసాయిదా ప్రకటన విడుదల చేసి మరోసారి అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామన్నారు. గతంలో మాదిరిగా.. అశాస్త్రీయంగా ఏదీ జరగదని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా జిల్లాల్లో ఇళ్ల స్థలాలను కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
This post was last modified on January 12, 2026 9:57 pm
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్లో ఆమె చేసిన…