ఇటీవలే విడుదలైన లవ్ రెడ్డికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా కొంత ప్రశంసలు దక్కిన మాటా నిజమే. అయితే థియేటర్ల దగ్గర జనం లేకపోవడం టీమ్ ని నిరాశ పరిచింది. అందుకే ఎన్నడూ లేనిది మొదటిసారి ఫెయిల్యూర్ మీట్ పేరుతో ఒక ఈవెంట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
నిజంగా సినిమా బాగుంటే కొంచెం నెమ్మదిగా అయినా ఆడియన్స్ ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు రుజువైనప్పటికీ లవ్ రెడ్డి టీమ్ రెండో రోజే తమ నిరాశను వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల దక్కిన ప్రయోజనం ఏంటనేది పక్కపెడితే ఇంకో రూపంలో పెద్ద బూస్ట్ దక్కింది.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్స్ టా స్టేటస్ లో లవ్ రెడ్డి గురించి మంచిగా వింటున్నానని పోస్ట్ చేయడం ఒక్కసారిగా అభిమానులను అలెర్ట్ చేసింది. గతంలో డార్లింగ్ ఇలా ఎన్నోసార్లు చేశాడు కానీ అవన్నీ అంతో ఇంతో స్టార్ క్యాస్టింగ్ లేదా పెద్ద నిర్మాణ సంస్థలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కానీ లవ్ రెడ్డి విషయంలో అవేవీ లేవు.
అసలు కారణం ఏంటయ్యా అంటే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ చిత్రం గురించి ప్రభాస్ తో మాట్లాడుతూ చెబుతూ ఏదైనా ప్రోత్సాహం దక్కితే బాగుంటుందని అన్నారట. అంతే క్షణం ఆలోచించకుండా సీనియర్ అడిగారు కాబట్టి వెంటనే స్టేటస్ పెట్టేశాడు.
ఇలాంటి ఎంకరేజ్మెంట్ చిన్న సినిమాలకు కలిగించే లాభం మాములుగా ఉండదు. ఎలాగూ వీకెండ్ కాబట్టి యూత్ లవ్ రెడ్డి వైపు చూసేందుకు ప్రభాస్ మాటలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఊహించని క్లైమాక్స్ తో ఒక ప్రేమకథను ప్రెజెంట్ చేసిన లవ్ రెడ్డి తన ప్రమోషన్లలో చెప్పుకున్నట్టు నిజంగా బేబీ రేంజ్ లో ఉంటే పోటీ లేని బాక్సాఫీస్ వద్ద విజయం దక్కేది.
యావరేజా ఫ్లాపా అనేది పక్కనపెడితే తమ హీరో పెద్ద మనసు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఇంకో మూడు రోజుల్లో అక్టోబర్ 23 పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ప్రభాస్ నిర్మాతల నుంచి బోలెడు అప్డేట్స్ రాబోతున్నాయి.
This post was last modified on October 20, 2024 2:42 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…