Movie News

వాళ్లు సమంతే కావాలంటే.. వీళ్లు సమంత వద్దన్నారట

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. సొంత ప్రొడక్షన్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ.. అది ముందుకు కదులుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.

ఐతే సమంతను త్వరలో బుల్లితెర పై చూడబోతున్నాం. ఆమె ముఖ్య పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సిరీస్ కూడా సమంత చేజారాల్సింది. ఈ సిరీస్ కోసం అడిగినపుడే సమంతకు మయోసైటిల్ వ్యాధి నిర్ధారణ అయింది.

దీంతో ఇందులో నటించడం కష్టమని సమంతే అనుకుందట. కానీ దర్శకులు రాజ్-డీకే హనీ పాత్రను సమంతే చేయాలని పట్టుబట్టి ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ఎదురు చూసినట్లు సమంత స్వయంగా వెల్లడించింది.

ఐతే రాజ్-డీకే సమంత కోసం అంత పట్టుబడితే.. సమంతతో ఎందుకు నటించడం అంటూ చాలామంది హీరో వరుణ్ ధావన్‌కు సలహాలు ఇచ్చారట. బాలీవుడ్ హీరోలు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌ల్లో నటించిన ముంబయి హీరోయిన్లనే జోడీగా ఎంచుకుంటారు.

వాళ్లకు దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది కాబట్టి మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. సౌత్ హీరోయిన్ల పట్ల అంతగా ఆసక్తి చూపించరు. ఈ ఉద్దేశంతోనో ఏమో.. చాలామంది తనకు సమంత కథానాయికగా వద్దని సలహాలు ఇచ్చారని వరుణ్ తెలిపాడు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్నే ఎంచుకోమని చెప్పారన్నాడు.

కానీ రాజ్-డీకేలతో పాటు తాను కూడా సమంత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని భావించి తననే ఎంచుకున్నట్లు వరుణ్ తెలిపాడు. వరుణ్ ఈ సిరీస్‌లో బన్నీ అనే పాత్రలో నటించాడు. ఇందులో వరుణ్-సామ్ సీక్రెట్ ఏంజెంట్లుగా కనిపించనున్నారు.

This post was last modified on October 20, 2024 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

6 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

49 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago