ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. సొంత ప్రొడక్షన్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ.. అది ముందుకు కదులుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఐతే సమంతను త్వరలో బుల్లితెర పై చూడబోతున్నాం. ఆమె ముఖ్య పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సిరీస్ కూడా సమంత చేజారాల్సింది. ఈ సిరీస్ కోసం అడిగినపుడే సమంతకు మయోసైటిల్ వ్యాధి నిర్ధారణ అయింది.
దీంతో ఇందులో నటించడం కష్టమని సమంతే అనుకుందట. కానీ దర్శకులు రాజ్-డీకే హనీ పాత్రను సమంతే చేయాలని పట్టుబట్టి ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ఎదురు చూసినట్లు సమంత స్వయంగా వెల్లడించింది.
ఐతే రాజ్-డీకే సమంత కోసం అంత పట్టుబడితే.. సమంతతో ఎందుకు నటించడం అంటూ చాలామంది హీరో వరుణ్ ధావన్కు సలహాలు ఇచ్చారట. బాలీవుడ్ హీరోలు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్ల్లో నటించిన ముంబయి హీరోయిన్లనే జోడీగా ఎంచుకుంటారు.
వాళ్లకు దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది కాబట్టి మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. సౌత్ హీరోయిన్ల పట్ల అంతగా ఆసక్తి చూపించరు. ఈ ఉద్దేశంతోనో ఏమో.. చాలామంది తనకు సమంత కథానాయికగా వద్దని సలహాలు ఇచ్చారని వరుణ్ తెలిపాడు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్నే ఎంచుకోమని చెప్పారన్నాడు.
కానీ రాజ్-డీకేలతో పాటు తాను కూడా సమంత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని భావించి తననే ఎంచుకున్నట్లు వరుణ్ తెలిపాడు. వరుణ్ ఈ సిరీస్లో బన్నీ అనే పాత్రలో నటించాడు. ఇందులో వరుణ్-సామ్ సీక్రెట్ ఏంజెంట్లుగా కనిపించనున్నారు.
This post was last modified on October 20, 2024 11:02 am
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…