Movie News

వాళ్లు సమంతే కావాలంటే.. వీళ్లు సమంత వద్దన్నారట

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. సొంత ప్రొడక్షన్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ.. అది ముందుకు కదులుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.

ఐతే సమంతను త్వరలో బుల్లితెర పై చూడబోతున్నాం. ఆమె ముఖ్య పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సిరీస్ కూడా సమంత చేజారాల్సింది. ఈ సిరీస్ కోసం అడిగినపుడే సమంతకు మయోసైటిల్ వ్యాధి నిర్ధారణ అయింది.

దీంతో ఇందులో నటించడం కష్టమని సమంతే అనుకుందట. కానీ దర్శకులు రాజ్-డీకే హనీ పాత్రను సమంతే చేయాలని పట్టుబట్టి ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ఎదురు చూసినట్లు సమంత స్వయంగా వెల్లడించింది.

ఐతే రాజ్-డీకే సమంత కోసం అంత పట్టుబడితే.. సమంతతో ఎందుకు నటించడం అంటూ చాలామంది హీరో వరుణ్ ధావన్‌కు సలహాలు ఇచ్చారట. బాలీవుడ్ హీరోలు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌ల్లో నటించిన ముంబయి హీరోయిన్లనే జోడీగా ఎంచుకుంటారు.

వాళ్లకు దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది కాబట్టి మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. సౌత్ హీరోయిన్ల పట్ల అంతగా ఆసక్తి చూపించరు. ఈ ఉద్దేశంతోనో ఏమో.. చాలామంది తనకు సమంత కథానాయికగా వద్దని సలహాలు ఇచ్చారని వరుణ్ తెలిపాడు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్నే ఎంచుకోమని చెప్పారన్నాడు.

కానీ రాజ్-డీకేలతో పాటు తాను కూడా సమంత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని భావించి తననే ఎంచుకున్నట్లు వరుణ్ తెలిపాడు. వరుణ్ ఈ సిరీస్‌లో బన్నీ అనే పాత్రలో నటించాడు. ఇందులో వరుణ్-సామ్ సీక్రెట్ ఏంజెంట్లుగా కనిపించనున్నారు.

This post was last modified on October 20, 2024 11:02 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

1 hour ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

1 hour ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

4 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

4 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

5 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

5 hours ago