Movie News

నా చేతుల్లో లేకుండా పోయింది-కిరణ్ అబ్బవరం

చేసిన తప్పులు ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ సినీ రంగంలో ఆ పని చేసేవారు తక్కువ. ఐతే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం తన కెరీర్ డౌన్ కావడంపై నిజాయితీగా మాట్లాడుతున్నాడు. తొందరపడి కొన్ని సినిమాలు ఒప్పుకున్నానని.. అందువల్లే ఫ్లాపులు తప్పలేదని.. కానీ ఇకపై జాగ్రత్తగా అడుగులు వేస్తానని చెబుతున్నాడు.

‘రాజా వారు రాణివారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన కిరణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు అతడి పేరును బాగా దెబ్బ తీశాయి. ఈ ఫెయిల్యూర్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడాడు.

“నేను చేసిన సినిమాల విషయంలో పశ్చాత్తాపం లేదు. నాకంటూ ఏ గుర్తింపూ లేని సమయంలో ‘రాజావారు రాణి వారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రాల్లో అవకాశం లభించింది. కష్టపడి ఆ అవకాశాలు తెచ్చుకున్నాను. ఆ సినిమాలు చేసే సమయానికి ఇండస్ట్రీ ఎలా పని చేస్తుంది.. ఇక్కడి వ్యవహారాలేంటి అన్నది నాకు ఏమీ తెలియదు. షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చేసేశాను.

తొలి రెండు చిత్రాలు తెచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అప్పుడున్న ఎగ్జైట్మెంట్లో ఆరు సినిమాలు సంతకం చేసేశాను. పొద్దున ఒక సినిమా షూట్లో పాల్గొంటే.. మధ్యాహ్నం ఇంకో సినిమా కోసం పని చేసేవాడిని. నాకు తెలియకుండానే తప్పులు జరిగిపోయాయి. కొన్ని సినిమాల రిజల్ట్ ఏంటో నాకు ముందే తెలిసినా ఏమీ చేయడానికి ఏమీ లేకపోయింది. కొన్ని సినిమాల విషయంలో నా పాత్రల వరకే చూసుకున్నా. మిగతా విషయాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులేంటో నాకు బాగా అర్థమైంది. ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి. లౌక్యం ఉండాలి. అవి నాకు లేవు. నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నా. ఇక నుంచి నా నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో అన్నీ చూసుకుంటున్నా. జాగ్రత్తగా చేస్తున్నా. ఇకపై అభిమానులను నిరాశపరచను. అందుకు తొలి అడుగు ‘క’ మూవీ” అని కిరణ్ తెలిపాడు.

This post was last modified on October 19, 2024 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago