చేసిన తప్పులు ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ సినీ రంగంలో ఆ పని చేసేవారు తక్కువ. ఐతే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం తన కెరీర్ డౌన్ కావడంపై నిజాయితీగా మాట్లాడుతున్నాడు. తొందరపడి కొన్ని సినిమాలు ఒప్పుకున్నానని.. అందువల్లే ఫ్లాపులు తప్పలేదని.. కానీ ఇకపై జాగ్రత్తగా అడుగులు వేస్తానని చెబుతున్నాడు.
‘రాజా వారు రాణివారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన కిరణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు అతడి పేరును బాగా దెబ్బ తీశాయి. ఈ ఫెయిల్యూర్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడాడు.
“నేను చేసిన సినిమాల విషయంలో పశ్చాత్తాపం లేదు. నాకంటూ ఏ గుర్తింపూ లేని సమయంలో ‘రాజావారు రాణి వారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రాల్లో అవకాశం లభించింది. కష్టపడి ఆ అవకాశాలు తెచ్చుకున్నాను. ఆ సినిమాలు చేసే సమయానికి ఇండస్ట్రీ ఎలా పని చేస్తుంది.. ఇక్కడి వ్యవహారాలేంటి అన్నది నాకు ఏమీ తెలియదు. షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చేసేశాను.
తొలి రెండు చిత్రాలు తెచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అప్పుడున్న ఎగ్జైట్మెంట్లో ఆరు సినిమాలు సంతకం చేసేశాను. పొద్దున ఒక సినిమా షూట్లో పాల్గొంటే.. మధ్యాహ్నం ఇంకో సినిమా కోసం పని చేసేవాడిని. నాకు తెలియకుండానే తప్పులు జరిగిపోయాయి. కొన్ని సినిమాల రిజల్ట్ ఏంటో నాకు ముందే తెలిసినా ఏమీ చేయడానికి ఏమీ లేకపోయింది. కొన్ని సినిమాల విషయంలో నా పాత్రల వరకే చూసుకున్నా. మిగతా విషయాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులేంటో నాకు బాగా అర్థమైంది. ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి. లౌక్యం ఉండాలి. అవి నాకు లేవు. నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నా. ఇక నుంచి నా నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో అన్నీ చూసుకుంటున్నా. జాగ్రత్తగా చేస్తున్నా. ఇకపై అభిమానులను నిరాశపరచను. అందుకు తొలి అడుగు ‘క’ మూవీ” అని కిరణ్ తెలిపాడు.
This post was last modified on October 19, 2024 5:49 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…