Movie News

అమావాస్య గండం – ప్రీమియర్ల మంత్రం

రాబోయే అక్టోబర్ 31 అమావాస్య ఉంది. దీపావళి పండగే అయినప్పటికీ కొన్ని సెంటిమెంట్లు కఠినంగా పాటించే వాళ్ళు ఏదైనా మొదలుపెట్టే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు మరీనూ. ఆ రోజు విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిర్మాతలు ఈ కోణంలో విశ్లేషించుకుని ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 30 తేదీ సాయంత్రం నుంచే షోలు వేస్తామని నిర్మాత నాగ వంశీ గతంలోనే ప్రకటించగా, క వైపు నుంచి అధికారిక ప్రకటన ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది.

పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైన నిర్ణయమేనని చెప్పాలి. మరుసటి రోజు సెలవు కాబట్టి 30 సాయంత్రం, సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ పడతాయి. ఇంకా చెప్పాలంటే 31న పండగ హడావిడి, పటాసులు కాల్చే పనిలో బిజీగా ఉండి జనం థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. సో వాళ్లంతా ప్రీమియర్లకు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు. బలగం, మేజర్ లాగా టాక్ యునానిమస్ టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదూ మిస్టర్ బచ్చన్ లాగా తేడా కొడితే ఇబ్బంది. కానీ కిరణ్, దుల్కర్ ప్రొడ్యూసర్లలో విజయం పట్ల ఒక్క శాతం అనుమానం లేదు.

ఈ రెండు కాసేపు పక్కనపెడితే 31 విడుదలవుతున్న వాటిలో డబ్బింగ్ మూవీ అమరన్ ఉంది. సాయిపల్లవి హీరోయిన్ కావడంతో తెలుగులోనూ బజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా తెలుగు వెర్షన్ కోసం శివ కార్తికేయన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ రచన, పర్యవేక్షణ చేసిన కన్నడ అనువాదం బఘీరా మీద బజ్ ఎక్కువ లేదు కానీ హోంబాలే ప్రొడక్షన్ కాబట్టి తక్కువంచనా వేయలేం. ఇక సత్యదేవ్ జీబ్రా క్రమంగా హైప్ పెంచుతోంది. కానీ ఇది చాలదు. పబ్లిసిటీ వేగం పెంచాలి. మరి ఇక్కడ చెప్పిన మూడింటిలో ఏవి ప్రీమియర్లకు సై అంటాయో చూడాలి.

This post was last modified on October 19, 2024 12:12 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 minute ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

48 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

56 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago