రాబోయే అక్టోబర్ 31 అమావాస్య ఉంది. దీపావళి పండగే అయినప్పటికీ కొన్ని సెంటిమెంట్లు కఠినంగా పాటించే వాళ్ళు ఏదైనా మొదలుపెట్టే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు మరీనూ. ఆ రోజు విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిర్మాతలు ఈ కోణంలో విశ్లేషించుకుని ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 30 తేదీ సాయంత్రం నుంచే షోలు వేస్తామని నిర్మాత నాగ వంశీ గతంలోనే ప్రకటించగా, క వైపు నుంచి అధికారిక ప్రకటన ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది.
పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైన నిర్ణయమేనని చెప్పాలి. మరుసటి రోజు సెలవు కాబట్టి 30 సాయంత్రం, సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ పడతాయి. ఇంకా చెప్పాలంటే 31న పండగ హడావిడి, పటాసులు కాల్చే పనిలో బిజీగా ఉండి జనం థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. సో వాళ్లంతా ప్రీమియర్లకు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు. బలగం, మేజర్ లాగా టాక్ యునానిమస్ టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదూ మిస్టర్ బచ్చన్ లాగా తేడా కొడితే ఇబ్బంది. కానీ కిరణ్, దుల్కర్ ప్రొడ్యూసర్లలో విజయం పట్ల ఒక్క శాతం అనుమానం లేదు.
ఈ రెండు కాసేపు పక్కనపెడితే 31 విడుదలవుతున్న వాటిలో డబ్బింగ్ మూవీ అమరన్ ఉంది. సాయిపల్లవి హీరోయిన్ కావడంతో తెలుగులోనూ బజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా తెలుగు వెర్షన్ కోసం శివ కార్తికేయన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ రచన, పర్యవేక్షణ చేసిన కన్నడ అనువాదం బఘీరా మీద బజ్ ఎక్కువ లేదు కానీ హోంబాలే ప్రొడక్షన్ కాబట్టి తక్కువంచనా వేయలేం. ఇక సత్యదేవ్ జీబ్రా క్రమంగా హైప్ పెంచుతోంది. కానీ ఇది చాలదు. పబ్లిసిటీ వేగం పెంచాలి. మరి ఇక్కడ చెప్పిన మూడింటిలో ఏవి ప్రీమియర్లకు సై అంటాయో చూడాలి.
This post was last modified on October 19, 2024 12:12 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…