రాబోయే అక్టోబర్ 31 అమావాస్య ఉంది. దీపావళి పండగే అయినప్పటికీ కొన్ని సెంటిమెంట్లు కఠినంగా పాటించే వాళ్ళు ఏదైనా మొదలుపెట్టే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు మరీనూ. ఆ రోజు విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిర్మాతలు ఈ కోణంలో విశ్లేషించుకుని ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 30 తేదీ సాయంత్రం నుంచే షోలు వేస్తామని నిర్మాత నాగ వంశీ గతంలోనే ప్రకటించగా, క వైపు నుంచి అధికారిక ప్రకటన ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది.
పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైన నిర్ణయమేనని చెప్పాలి. మరుసటి రోజు సెలవు కాబట్టి 30 సాయంత్రం, సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ పడతాయి. ఇంకా చెప్పాలంటే 31న పండగ హడావిడి, పటాసులు కాల్చే పనిలో బిజీగా ఉండి జనం థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. సో వాళ్లంతా ప్రీమియర్లకు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు. బలగం, మేజర్ లాగా టాక్ యునానిమస్ టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదూ మిస్టర్ బచ్చన్ లాగా తేడా కొడితే ఇబ్బంది. కానీ కిరణ్, దుల్కర్ ప్రొడ్యూసర్లలో విజయం పట్ల ఒక్క శాతం అనుమానం లేదు.
ఈ రెండు కాసేపు పక్కనపెడితే 31 విడుదలవుతున్న వాటిలో డబ్బింగ్ మూవీ అమరన్ ఉంది. సాయిపల్లవి హీరోయిన్ కావడంతో తెలుగులోనూ బజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా తెలుగు వెర్షన్ కోసం శివ కార్తికేయన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ రచన, పర్యవేక్షణ చేసిన కన్నడ అనువాదం బఘీరా మీద బజ్ ఎక్కువ లేదు కానీ హోంబాలే ప్రొడక్షన్ కాబట్టి తక్కువంచనా వేయలేం. ఇక సత్యదేవ్ జీబ్రా క్రమంగా హైప్ పెంచుతోంది. కానీ ఇది చాలదు. పబ్లిసిటీ వేగం పెంచాలి. మరి ఇక్కడ చెప్పిన మూడింటిలో ఏవి ప్రీమియర్లకు సై అంటాయో చూడాలి.
This post was last modified on October 19, 2024 12:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…