విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అయిపోతున్నాయి. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే డ్రామాకు క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ జోడించిన రావిపూడి ఇందులో కమర్షియల్ అంశాల కంటే కామెడీకి పెద్ద పీఠ వేసినట్టు యూనిట్ లో పని చేసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట.
ఎఫ్2, ఎఫ్3లో బోలెడు ఆర్టిస్టులున్నా సరే వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. వరుణ్ తేజ్ హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76లో అలాంటి స్కోప్ లేకపోవడంతో మొత్తం భారం వెంకటేష్ మీదే పెట్టినట్టు తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్న టైంలోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వడం పలు సందర్భాల్లో జరిగిందట. ముఖ్యంగా హీరోతో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య నడిచే సీన్లు ఓ రేంజ్ లో పేలాయని ఊరిస్తున్నారు. ఇతర తారాగణంతో కాంబో సన్నివేశాలు సైతం ఇదే తరహాలో వచ్చాయట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజనే ఉద్దేశంతో దీన్నే లాక్ చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పేరు కూడా మారొచ్చని అంటున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే దాకా రామ్ చరణ్, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో ఉన్నట్టే లెక్క. రెండూ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్ణయం ఏంటో తెలిశాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకటేష్ తిరిగి తన పాత స్కూల్ కి తిరిగి వచ్చేశారు.
This post was last modified on October 18, 2024 2:55 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…