విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అయిపోతున్నాయి. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే డ్రామాకు క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ జోడించిన రావిపూడి ఇందులో కమర్షియల్ అంశాల కంటే కామెడీకి పెద్ద పీఠ వేసినట్టు యూనిట్ లో పని చేసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట.
ఎఫ్2, ఎఫ్3లో బోలెడు ఆర్టిస్టులున్నా సరే వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. వరుణ్ తేజ్ హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76లో అలాంటి స్కోప్ లేకపోవడంతో మొత్తం భారం వెంకటేష్ మీదే పెట్టినట్టు తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్న టైంలోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వడం పలు సందర్భాల్లో జరిగిందట. ముఖ్యంగా హీరోతో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య నడిచే సీన్లు ఓ రేంజ్ లో పేలాయని ఊరిస్తున్నారు. ఇతర తారాగణంతో కాంబో సన్నివేశాలు సైతం ఇదే తరహాలో వచ్చాయట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజనే ఉద్దేశంతో దీన్నే లాక్ చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పేరు కూడా మారొచ్చని అంటున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే దాకా రామ్ చరణ్, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో ఉన్నట్టే లెక్క. రెండూ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్ణయం ఏంటో తెలిశాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకటేష్ తిరిగి తన పాత స్కూల్ కి తిరిగి వచ్చేశారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…