విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అయిపోతున్నాయి. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే డ్రామాకు క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ జోడించిన రావిపూడి ఇందులో కమర్షియల్ అంశాల కంటే కామెడీకి పెద్ద పీఠ వేసినట్టు యూనిట్ లో పని చేసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట.
ఎఫ్2, ఎఫ్3లో బోలెడు ఆర్టిస్టులున్నా సరే వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. వరుణ్ తేజ్ హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76లో అలాంటి స్కోప్ లేకపోవడంతో మొత్తం భారం వెంకటేష్ మీదే పెట్టినట్టు తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్న టైంలోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వడం పలు సందర్భాల్లో జరిగిందట. ముఖ్యంగా హీరోతో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య నడిచే సీన్లు ఓ రేంజ్ లో పేలాయని ఊరిస్తున్నారు. ఇతర తారాగణంతో కాంబో సన్నివేశాలు సైతం ఇదే తరహాలో వచ్చాయట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజనే ఉద్దేశంతో దీన్నే లాక్ చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పేరు కూడా మారొచ్చని అంటున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే దాకా రామ్ చరణ్, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో ఉన్నట్టే లెక్క. రెండూ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్ణయం ఏంటో తెలిశాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకటేష్ తిరిగి తన పాత స్కూల్ కి తిరిగి వచ్చేశారు.
This post was last modified on October 18, 2024 2:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…