విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అయిపోతున్నాయి. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే డ్రామాకు క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ జోడించిన రావిపూడి ఇందులో కమర్షియల్ అంశాల కంటే కామెడీకి పెద్ద పీఠ వేసినట్టు యూనిట్ లో పని చేసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట.
ఎఫ్2, ఎఫ్3లో బోలెడు ఆర్టిస్టులున్నా సరే వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. వరుణ్ తేజ్ హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76లో అలాంటి స్కోప్ లేకపోవడంతో మొత్తం భారం వెంకటేష్ మీదే పెట్టినట్టు తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్న టైంలోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వడం పలు సందర్భాల్లో జరిగిందట. ముఖ్యంగా హీరోతో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య నడిచే సీన్లు ఓ రేంజ్ లో పేలాయని ఊరిస్తున్నారు. ఇతర తారాగణంతో కాంబో సన్నివేశాలు సైతం ఇదే తరహాలో వచ్చాయట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజనే ఉద్దేశంతో దీన్నే లాక్ చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పేరు కూడా మారొచ్చని అంటున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే దాకా రామ్ చరణ్, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో ఉన్నట్టే లెక్క. రెండూ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్ణయం ఏంటో తెలిశాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకటేష్ తిరిగి తన పాత స్కూల్ కి తిరిగి వచ్చేశారు.
This post was last modified on October 18, 2024 2:55 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…