అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై చర్చలు జరుపుతున్నా కూడా బయటకు చెప్పడం లేదు. ఇండస్ట్రీలో ఆనోట ఈనోట పడి లీక్ అవ్వడమే గాని సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయడం లేదు. ఆమధ్య కొత్త డైరెక్టర్ తోనే యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో మరి దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.
ఇక మొన్నటివరకు పూరి జగన్నాథ్ కూడా అఖిల్ కోసం ప్రయత్నం చేయగా పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్. ఇప్పుడు ఫైనల్ గా అఖిల్ ఓ చిన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేసిన యువ దర్శకుడు మురళీ కిషోర్ అని తెలుస్తోంది.
నాగార్జున స్వయంగా కథ విషయంలో నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియడ్ డ్రామాగా తెరికక్కనుందట. ప్రాజెక్టు ఖర్చు విషయంలో అసలు రాజీ పడకూడదని స్వయంగా నాగ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాను నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారు.
నాగ్ తలచుకుంటే అఖిల్ కోసం బడా దర్శకులను లైన్ లో పెట్టవచ్చు. కానీ అలా కాకుండా సింపుల్ గానే నేటితరం యువ దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు. పాతకాలం బ్యాక్ డ్రాప్ కావున ఈసారి అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి యువ దర్శకుడు మురళి కిషోర్ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…