Movie News

అఖిల్ తిరుపతి బ్యాక్ డ్రాప్.. రంగంలోకి నాగ్!

అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై చర్చలు జరుపుతున్నా కూడా బయటకు చెప్పడం లేదు. ఇండస్ట్రీలో ఆనోట ఈనోట పడి లీక్ అవ్వడమే గాని సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయడం లేదు. ఆమధ్య కొత్త డైరెక్టర్ తోనే యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో మరి దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇక మొన్నటివరకు పూరి జగన్నాథ్ కూడా అఖిల్ కోసం ప్రయత్నం చేయగా పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్. ఇప్పుడు ఫైనల్ గా అఖిల్ ఓ చిన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేసిన యువ దర్శకుడు మురళీ కిషోర్ అని తెలుస్తోంది.

నాగార్జున స్వయంగా కథ విషయంలో నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియడ్ డ్రామాగా తెరికక్కనుందట. ప్రాజెక్టు ఖర్చు విషయంలో అసలు రాజీ పడకూడదని స్వయంగా నాగ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాను నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారు.

నాగ్ తలచుకుంటే అఖిల్ కోసం బడా దర్శకులను లైన్ లో పెట్టవచ్చు. కానీ అలా కాకుండా సింపుల్ గానే నేటితరం యువ దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు. పాతకాలం బ్యాక్ డ్రాప్ కావున ఈసారి అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి యువ దర్శకుడు మురళి కిషోర్ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

This post was last modified on October 18, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 minute ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

15 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago