Movie News

అఖిల్ తిరుపతి బ్యాక్ డ్రాప్.. రంగంలోకి నాగ్!

అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై చర్చలు జరుపుతున్నా కూడా బయటకు చెప్పడం లేదు. ఇండస్ట్రీలో ఆనోట ఈనోట పడి లీక్ అవ్వడమే గాని సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయడం లేదు. ఆమధ్య కొత్త డైరెక్టర్ తోనే యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో మరి దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇక మొన్నటివరకు పూరి జగన్నాథ్ కూడా అఖిల్ కోసం ప్రయత్నం చేయగా పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్. ఇప్పుడు ఫైనల్ గా అఖిల్ ఓ చిన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేసిన యువ దర్శకుడు మురళీ కిషోర్ అని తెలుస్తోంది.

నాగార్జున స్వయంగా కథ విషయంలో నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియడ్ డ్రామాగా తెరికక్కనుందట. ప్రాజెక్టు ఖర్చు విషయంలో అసలు రాజీ పడకూడదని స్వయంగా నాగ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాను నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారు.

నాగ్ తలచుకుంటే అఖిల్ కోసం బడా దర్శకులను లైన్ లో పెట్టవచ్చు. కానీ అలా కాకుండా సింపుల్ గానే నేటితరం యువ దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు. పాతకాలం బ్యాక్ డ్రాప్ కావున ఈసారి అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి యువ దర్శకుడు మురళి కిషోర్ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

This post was last modified on October 18, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

54 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

55 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

9 hours ago