Movie News

ఒక షెడ్యూల్‌ అయ్యాక రకుల్‌ను తీసేసి..

టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కథానాయికగా పరిచయమై సూపర్ హిట్ అందుకున్న రకుల్.. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2015-16 టైంలో ఆమె నంబర్ వన్ హీరోయిన్‌ అనే గుర్తింపు సంపాదించింది.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా టాప్ హీరోలతో ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’ లాంటి హిట్ సినిమాల్లో నటించి తిరుగులేని స్థాయికి చేరుకుంది. కానీ తర్వాత వరుసగా ఫ్లాపులు పడడంతో ఆమె కెరీర్ డౌన్ అయిపోయింది.

తర్వాత కొన్నేళ్లకు అసలు కనిపించకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కు సినిమాలే లేవు. వేరే భాషల్లో కూడా కెరీర్ అంతంతమాత్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్లో జరిగిన తప్పులు, తనకు జరిగిన అన్యాయాల గురించి రకుల్ ఈ మధ్య ఇంటర్వ్యూల్లో ఓపెన్ అవుతోంది.

ఈ క్రమంలోనే తెలుగులో ఓ సినిమాకు తనను కథానాయికగా తీసుకుని.. తర్వాత తప్పించడం గురించి రకుల్ మాట్లాడింది. ‘‘ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నాకు హీరోయిన్‌గా అవకావం వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం. అప్పుడు నేను ఢిల్లీలో చదువుతుండేదాన్ని. షెడ్యూల్ అయ్యాక ఢిల్లీ వెళ్లాను. తర్వాతి షెడ్యూల్ కోసం పిలుస్తారని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ ఎన్ని రోజులైనా నాకు కాల్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని తర్వాత తెలిసింది. వాళ్లిద్దరూ అంతకుముందే ఓ హిట్ మూవీలో నటించారు. దీంతో ఆ జోడీ బాగుంటుందని మళ్లీ తననే తీసుకున్నారు. సినిమా అనేది వ్యాపారం. కాబట్టి దీన్ని తప్పుట్టలేం. కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు మామూలే. ఒక సినిమా పోయినా ఇంకోటి వస్తుందనే పాజిటివ్ ఆలోచనతో నేనుంటా’’ అని రకుల్ చెప్పింది.

నెపోటిజం కారణంగా తాను పలు అవకాశాలు కోల్పోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రకుల్ వ్యాఖ్యానించింది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago