ప్రస్తుత ట్రెండ్ లో మాస్ కమర్షియల్ దర్శకులుగా నిలదొక్కుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు ఈ ఫార్మాట్ లో హిట్టు కాకపోయినా నష్టాలు రాకుండా సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కాస్త తేడా కొడితే దారుణమైన నష్టాలు కూడా వస్తున్నాయి. బి.గోపాల్ – వినాయక్ లాంటి వాళ్ళు నేటితరం మాస్ ఆడియెన్స్ అంచనాలను అందుకోలేక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
కానీ అదే ట్రాక్ లో వెళుతున్న బోయపాటి, బాలయ్య పవర్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేరే హీరోతో చేస్తే ఫలితం రివర్స్ అవుతున్నా బాలయ్యతో మాత్రం 100% స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో అఖండ 2పై అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఇక బోయపాటి కెరీర్ మొదటి నుంచి కూడా బడ్జెట్ విషయంలో ట్విస్టులు ఇస్తాడనే టాక్ ఉంది. పర్ఫెక్షన్ కోసం యాక్షన్ సన్నివేశాలకు భారీగా ఖర్చు చేస్తాడు. అందుకే ప్రతీసారి రెమ్యునరేషన్ లో కోతలు కూడా ఎదుర్కొన్నాడు.
నిర్మాతలతో గొడవ పడలేక సినిమా అవుట్ ఫుట్ బాగుండాలి అని రెమ్యునరేషన్ తగ్గించిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇక అఖండ టైమ్ లో అయితే అసలు రెమ్యునరేషన్ లేకుండా ప్రాఫిట్ లో షేర్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకు కూడా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. అది హిట్టయ్యింది కాబట్టి ఓకే. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక ఇప్పుడు అఖండ 2: తాండవం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్.
ఇక ఈసారైనా బోయపాటి అనుకున్న బడ్జెట్ లో సినిమా ఫినిష్ చేస్తాడా లేదా అన్నది అసలు ప్రశ్న. ప్రతీసారి ఒక బడ్జెట్ అనుకుంటే దానిపైనే ఎంతోకొంత పెరుగుతోంది. అయితే ఈసారి అలాంటి సమస్య రాకుండా బాలయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. కూతురి సమర్పణలో వస్తోంది కాబట్టి ముందుగానే బడ్జెట్ హద్దులు దాటకుండా లైన్ గీసే ఉంటారు. అలాగే మార్కెట్ కు మించిన సాహసం కావున బోయపాటి సైతం ఆ లైన్ క్రాస్ చేయకపోవచ్చు.
This post was last modified on October 17, 2024 3:55 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…