కొన్ని సినిమాలు థియేటర్లలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఓటిటిలో వచ్చాక స్పందన వేరుగా ఉంటుంది. నెగటివ్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. కొన్నేళ్ల క్రితం జాతిరత్నాలు ముప్పై కోట్లకు వసూలు చేసి డిజిటల్ లోకి వచ్చాక ట్రోలింగ్ చేసిన వాళ్లే ఎక్కువ. ఇదెలా ఆడిందనే కామెంట్స్ వచ్చాయి. హనుమాన్, కల్కిలను సైతం ఇలా అన్నవాళ్ళు లేకపోలేదు. కానీ మత్తు వదలరా 2 కేసు వేరుగా నిలుస్తోంది. క్రేజీ సీక్వెల్ గా థియేటర్లలో రిలీజైనప్పుడు మంచి స్పందన తెచ్చుకుని లాభాలు మూటగట్టుకున్న ఈ పార్ట్ టూ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం మొదలైంది. అసలు కథ ఇక్కడ షురూ అయ్యింది.
కమెడియన్ సత్య విశ్వరూపాన్ని పెద్ద తెరపై మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఓటిటిలో షాకవుతున్నారు. ఆల్రెడీ చూసిన నెటిజెన్లు అందులో తమకు నచ్చిన క్రేజీ సీన్లను కట్ చేసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తల్లి కూతుళ్ళ వరస గురించి అజయ్ తో సత్య జరిపే సంభాషణ, రాజశేఖర్ మనసున్న మారాజు సినిమాలో పాటకు సత్య చేసే డాన్స్, ఓరి నా కొడకా సీరియల్ కామెడీ ఎపిసోడ్, చివర్లో సత్య చేసే చిరంజీవి నృత్యం ఇవన్నీ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఇంత ఫన్ ఉందాని ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే ఓటిటిలో షో వేసుకుంటున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే మత్తు వదలరా 2కి ధ్వజ స్థంభంలా నిలబడ్డ సత్య దీని దెబ్బతో డిమాండ్ అమాంతం పెంచేసుకున్నాడు. హీరో శ్రీసింహ కోడూరినే అయినప్పటికీ హైలైట్ అయ్యింది మాత్రం సత్యనే. ఇప్పుడు ఎక్స్ మాధ్యమంలో ఫ్యాన్స్ తననే ఎంజాయ్ చేస్తున్నారు. మత్తు వదలరాలోనే పేరు తెచ్చుకున్న సత్యకు ఇప్పుడొచ్చింది మాత్రం డబుల్ ట్రిపుల్ డోస్ లో. దర్శకుడు రితేష్ రానాకు హ్యాపీ బర్త్ డే ఇచ్చిన డిజాస్టర్ గాయం పూర్తిగా మానినట్టే. మూడో భాగం తీస్తానని చెబుతున్నారు కానీ వెంటనే ఉంటుందా లేక ఇంకో వేరే సినిమా తీశాక కొనసాగిస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
This post was last modified on October 17, 2024 11:06 am
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…