Movie News

మణిరత్నం – రజినీకాంత్.. ఆమె గాలి తీసేసింది!

కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తర్వాత కాస్త స్పీడ్ పెంచినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ అనే మూవీ చేస్తున్నారు. షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి కమల్ హాసన్ కథ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మణిరత్నం సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేస్తాడనే ప్రచారం నడుస్తోంది.

ఇప్పటికే మణిరత్నం రజినీకాంత్ కి స్టొరీ నేరేట్ చేసాడని కూడా కథనాలు వినిపించాయి. 33 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కబోతోందని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ కాంబినేషన్ పై మణిరత్నం వైఫ్, సీనియర్ యాక్టర్ సుహాసిని స్పష్టత ఇచ్చారు. ‘ఈ విషయం వారిద్దరికి కూడా తెలియదు. కేవలం వారిద్దరి కాంబోలో సినిమా వస్తోందని ప్రచారం చేసిన వారికి మాత్రమే తెలుసు’ అంటూ పరోక్షంగా కౌంటర్ వేసారు.

దీంతో మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా లేదని స్పష్టత వచ్చింది. మణిరత్నం ఫోకస్ అంతా ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తోన్న ‘థగ్ లైఫ్’ మీద మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరిగా రజినీకాంత్ మణిరత్నం దర్శకత్వంలో ‘దళపతి’ మూవీ చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి మరో పాత్రలో నటించారు.

మహాభారతం ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని మణిరత్నం తెరకెక్కించారు. ‘దళపతి’ రజినీకాంత్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

This post was last modified on October 17, 2024 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 minute ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

37 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago