కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తర్వాత కాస్త స్పీడ్ పెంచినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ అనే మూవీ చేస్తున్నారు. షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి కమల్ హాసన్ కథ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మణిరత్నం సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేస్తాడనే ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే మణిరత్నం రజినీకాంత్ కి స్టొరీ నేరేట్ చేసాడని కూడా కథనాలు వినిపించాయి. 33 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కబోతోందని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ కాంబినేషన్ పై మణిరత్నం వైఫ్, సీనియర్ యాక్టర్ సుహాసిని స్పష్టత ఇచ్చారు. ‘ఈ విషయం వారిద్దరికి కూడా తెలియదు. కేవలం వారిద్దరి కాంబోలో సినిమా వస్తోందని ప్రచారం చేసిన వారికి మాత్రమే తెలుసు’ అంటూ పరోక్షంగా కౌంటర్ వేసారు.
దీంతో మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా లేదని స్పష్టత వచ్చింది. మణిరత్నం ఫోకస్ అంతా ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తోన్న ‘థగ్ లైఫ్’ మీద మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరిగా రజినీకాంత్ మణిరత్నం దర్శకత్వంలో ‘దళపతి’ మూవీ చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి మరో పాత్రలో నటించారు.
మహాభారతం ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని మణిరత్నం తెరకెక్కించారు. ‘దళపతి’ రజినీకాంత్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
This post was last modified on October 17, 2024 11:08 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…