ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న చిన్న విషయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. మీడియాతో మాట్లాడేటపుడు మూవీ మేకర్స్ ఏదైనా నోరు జారితే సోషల్ మీడియా దాన్ని వలువలు చిలువలు చేసేస్తోంది. అందుకే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. అలా కాని పక్షంలో విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు తమిళ నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా మీడియా ముందు నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను ప్రొడ్యూస్ చేసిన ‘కంగువ’ సినిమా 2 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని కామెంట్ చేయడంతో.. ఏమిటీ అతి అంటూ ఆయన్ని ట్రోల్ చేశారు జనం. అది చాలదన్నట్లు పరోక్షంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ మీద కౌంటర్లు వేయడంతో దాని మీద వివాదం నడిచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ను ఓ ప్రశ్న అడిగారు. ‘కంగువ’ సినిమాకు సంబంధించి కాస్టింగ్ వివరాలను ముందే ఎందుకు బయటపెట్టలేదు అని. దానికాయన బదులిస్తూ.. “ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. ఆ చిత్రం మొదలవుతున్నపుడే నటీనటుల వివరాలన్నీ పంచుకున్నారు. కానీ దాని వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు రజినీ సినిమా ‘వేట్టయన్’ను ఉద్దేశించే అని భావించి రజినీ అభిమానులు జ్ఞానవేల్ రాజాను టార్గెట్ చేశారు. రజినీ సినిమా ప్రారంభమైనపుడే ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు.
ఐతే తన వ్యాఖ్యల మీద వివాదం చెలరేగడంతో జ్ఞానవేల్ రాజా వివరణ ఇచ్చాడు. తాను ఏ సినిమా పేరూ చెప్పలేదని.. తననూ ఎవరూ అడగలేదని.. ఎవరికి వాళ్లు ఏదో ఊహించేసుకున్నారని.. నిజానికి తాను మాట్లాడింది హిందీ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ గురించి అని చెప్పాడు జ్ఞానవేల్ రాజా. కానీ ఈ మాటను నెటిజన్లు నమ్మట్లేదు. హిందీ మూవీ గురించి జ్ఞానవేల్ మాట్లాడేందుకు ఆస్కారం లేదని.. ఆయన కామెంట్ చేసింది ‘వేట్టయన్’ గురించే అని.. ఇప్పుడు వివాదం అయ్యేసరికి కవర్ చేయడానికి ‘ఖేల్ ఖేల్ మే’ పేరు చెబుతున్నాడని విమర్శిస్తున్నారు.
This post was last modified on October 16, 2024 6:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…