ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న చిన్న విషయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. మీడియాతో మాట్లాడేటపుడు మూవీ మేకర్స్ ఏదైనా నోరు జారితే సోషల్ మీడియా దాన్ని వలువలు చిలువలు చేసేస్తోంది. అందుకే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. అలా కాని పక్షంలో విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు తమిళ నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా మీడియా ముందు నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను ప్రొడ్యూస్ చేసిన ‘కంగువ’ సినిమా 2 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని కామెంట్ చేయడంతో.. ఏమిటీ అతి అంటూ ఆయన్ని ట్రోల్ చేశారు జనం. అది చాలదన్నట్లు పరోక్షంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ మీద కౌంటర్లు వేయడంతో దాని మీద వివాదం నడిచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ను ఓ ప్రశ్న అడిగారు. ‘కంగువ’ సినిమాకు సంబంధించి కాస్టింగ్ వివరాలను ముందే ఎందుకు బయటపెట్టలేదు అని. దానికాయన బదులిస్తూ.. “ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. ఆ చిత్రం మొదలవుతున్నపుడే నటీనటుల వివరాలన్నీ పంచుకున్నారు. కానీ దాని వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు రజినీ సినిమా ‘వేట్టయన్’ను ఉద్దేశించే అని భావించి రజినీ అభిమానులు జ్ఞానవేల్ రాజాను టార్గెట్ చేశారు. రజినీ సినిమా ప్రారంభమైనపుడే ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు.
ఐతే తన వ్యాఖ్యల మీద వివాదం చెలరేగడంతో జ్ఞానవేల్ రాజా వివరణ ఇచ్చాడు. తాను ఏ సినిమా పేరూ చెప్పలేదని.. తననూ ఎవరూ అడగలేదని.. ఎవరికి వాళ్లు ఏదో ఊహించేసుకున్నారని.. నిజానికి తాను మాట్లాడింది హిందీ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ గురించి అని చెప్పాడు జ్ఞానవేల్ రాజా. కానీ ఈ మాటను నెటిజన్లు నమ్మట్లేదు. హిందీ మూవీ గురించి జ్ఞానవేల్ మాట్లాడేందుకు ఆస్కారం లేదని.. ఆయన కామెంట్ చేసింది ‘వేట్టయన్’ గురించే అని.. ఇప్పుడు వివాదం అయ్యేసరికి కవర్ చేయడానికి ‘ఖేల్ ఖేల్ మే’ పేరు చెబుతున్నాడని విమర్శిస్తున్నారు.
This post was last modified on October 16, 2024 6:01 pm
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…