కావ్య థాపర్.. ‘ఏక్ మిని కథ’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ. నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ఆ సినిమా మంచి స్పందనే తెచ్చుకుంది. ఆ చిత్రంలో చాలా వరకు కావ్య ట్రెడిషనల్ లుక్స్లోనే కనిపించింది కానీ.. ఒక పాటలో అందాల ఆరబోతతో యూత్ దృష్టిని ఆకర్షించింది. బహుశా ఆ పాటే తనకు తర్వాత అవకాశాలు తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు. తెలుగులో వరుసగా ఆమెకు మంచి మంచి సినిమాలు పడ్డాయి. కానీ ఆ సినిమాలు వరుసగా ఫెయిలవుతుండడంతో కావ్య కెరీర్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో కావ్య నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఏడాది ఆరంభంలో రవితేజ సరసన ‘ఈగల్’ లాంటి క్రేజీ మూవీలో నటించింది కావ్య. అందులో గ్లామర్తో పాటు నటనకూ స్కోప్ ఉన్న పాత్ర చేసింది కావ్య. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది.
ఇంకో వారానికే కావ్య నటించిన మరో చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ వచ్చింది. అందులో ఆమె గ్లామర్ రోల్ చేసింది. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ కావ్యనే హీరోయిన్. అందులో ఆమె సూపర్ సెక్సీగా కనిపించింది. పూరి జగన్నాథ్ హీరోయిన్లను మామూలుగానే చాలా గ్లామరస్గా చూపిస్తాడు. కావ్య కెరీర్లో మరే చిత్రంలోనూ చేయనంత ఎక్స్పోజింగ్ ఈ సినిమాలో చేసింది. కానీ దాని వల్ల ఫలితం లేకపోయింది. ‘డబుల్ ఇస్మార్ట్’ పెద్ద డిజాస్టర్ అయింది.
ఇక కావ్య నుంచి లేటెస్ట్గా ‘విశ్వం’ మూవీ వచ్చింది. ఇందులోనూ తనది గ్లామర్ రోలే. ఏ లిమిటేషన్స్ పెట్టకుండా యూత్ను ఆకట్టుకునేలా కావ్య చాలా సెక్సీగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా.. సినిమాలకు వీలైనంత మేర ప్లస్ అవుతున్నా.. ఆమె నటించిన సినిమాల్లో విషయం లేకపోవడం వల్ల ప్రతిసారీ ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. సినిమాలో కంటెంట్తో హీరోయిన్లకు ఏ సంబంధం లేకున్నా.. వరుసగా ఫెయిల్యూర్లు వచ్చాయంటే ఒక నెగెటివ్ ముద్ర పడిపోతుంది. కావ్య కూడా ఇప్పుడు అదే నెగెటివిటీని ఎదుర్కొంటోంది.
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…