ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సినిమా.. గుంటూరు కారం. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మూవీకి ఓపెనింగ్స్ బాగానేే వచ్చినా.. వీకెండ్ తర్వాత నిలబడలేకపోయింది. ‘హనుమాన్’ జోరు ముందు వెలవెలబోయి.. అంతిమంగా ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. ఐతే ఈ సినిమాను తాము ప్రమోట్ చేసే విషయంలో తప్పు చేశామని గతంలోనే నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
‘గుంటూరు కారం’ ఫ్యామిలీ నచ్చే క్లాస్ సినిమాగా ప్రమోట్ చేయాల్సిందని ఆయన అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘గుంటూరు కారం’ విషయంలో జరిగిన తప్పు గురించి నాగవంశీ మాట్లాడాడు. ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టాల్సింది కాదన్నాడు నాగవంశీ. ఈ టైటిల్ చూసి ఇది పక్కా మాస్ మూవీ అనే అభిప్రాయంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి.. సినిమా అలా లేకపోవడంతో నిరాశ చెందారన్నాడు.
నిజానికి ‘గుంటూరు కారం’ త్రివిక్రమ్ మార్కు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. సినిమాను అలాగే ప్రమోట్ చేయాల్సిందని నాగవంశీ అన్నాడు. అలాగే పెద్ద సినిమాలకు మిడ్ నైట్ ప్రిమియర్స్ వేసే విషయంలో మేకర్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాగవంశీ అభిప్రాయపడ్డాడు. మిడ్ నైట్ ప్రిమియర్స్ ఎక్కువగా ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులు చూస్తారని.. మాస్ సినిమా అయితే ఎంజాయ్ చేస్తారని.. క్లాస్ మూవీ అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని నాగవంశీ అన్నాడు.
క్లాస్ సినిమాకు కొంచెం లేటుగా ప్రిమియర్స్ వేస్తే వాటిని ఇష్టపడే ప్రేక్షకులు రిలాక్స్డ్గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని.. ఫీడ్ బ్యాక్ కూడా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ రోజుల్లో యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చే టాక్కు విలువ లేకుండా పోయిందని నాగవంశీ అన్నాడు.
గుంటూరు కారం, సలార్, దేవర లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ నుంచి మిక్స్డ్ టాకే వచ్చిందని.. అయినా కూడా వాటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని.. కాబట్టి యుఎస్ ప్రిమియర్ రివ్యూలు, టాక్ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోందని నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on October 16, 2024 4:38 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…