ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సినిమా.. గుంటూరు కారం. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మూవీకి ఓపెనింగ్స్ బాగానేే వచ్చినా.. వీకెండ్ తర్వాత నిలబడలేకపోయింది. ‘హనుమాన్’ జోరు ముందు వెలవెలబోయి.. అంతిమంగా ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. ఐతే ఈ సినిమాను తాము ప్రమోట్ చేసే విషయంలో తప్పు చేశామని గతంలోనే నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
‘గుంటూరు కారం’ ఫ్యామిలీ నచ్చే క్లాస్ సినిమాగా ప్రమోట్ చేయాల్సిందని ఆయన అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘గుంటూరు కారం’ విషయంలో జరిగిన తప్పు గురించి నాగవంశీ మాట్లాడాడు. ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టాల్సింది కాదన్నాడు నాగవంశీ. ఈ టైటిల్ చూసి ఇది పక్కా మాస్ మూవీ అనే అభిప్రాయంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి.. సినిమా అలా లేకపోవడంతో నిరాశ చెందారన్నాడు.
నిజానికి ‘గుంటూరు కారం’ త్రివిక్రమ్ మార్కు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. సినిమాను అలాగే ప్రమోట్ చేయాల్సిందని నాగవంశీ అన్నాడు. అలాగే పెద్ద సినిమాలకు మిడ్ నైట్ ప్రిమియర్స్ వేసే విషయంలో మేకర్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాగవంశీ అభిప్రాయపడ్డాడు. మిడ్ నైట్ ప్రిమియర్స్ ఎక్కువగా ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులు చూస్తారని.. మాస్ సినిమా అయితే ఎంజాయ్ చేస్తారని.. క్లాస్ మూవీ అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని నాగవంశీ అన్నాడు.
క్లాస్ సినిమాకు కొంచెం లేటుగా ప్రిమియర్స్ వేస్తే వాటిని ఇష్టపడే ప్రేక్షకులు రిలాక్స్డ్గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని.. ఫీడ్ బ్యాక్ కూడా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ రోజుల్లో యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చే టాక్కు విలువ లేకుండా పోయిందని నాగవంశీ అన్నాడు.
గుంటూరు కారం, సలార్, దేవర లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ నుంచి మిక్స్డ్ టాకే వచ్చిందని.. అయినా కూడా వాటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని.. కాబట్టి యుఎస్ ప్రిమియర్ రివ్యూలు, టాక్ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోందని నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on October 16, 2024 4:38 pm
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…