సూపర్ స్టార్ రజినీకాంత్ను ఆయన అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, ఆరాధిస్తారో తెలిసిందే. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే కాక..వివాదాలకు దూరంగా ఉంటూ.. సున్నితంగా మాట్లాడే రజినీని ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో గౌరవిస్తుంటారు. ఆయన్ని నో నెగెటివిటీ స్టార్గా చెప్పొచ్చు.
కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి హీరో మీద కూడా అదే పనిగా నెగెటివ్ ట్రెండ్ చేసే పరిస్థితులు వచ్చేశాయి. సూపర్ స్టార్ తాజాగా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జై భీమ్ లాంటి గొప్ప సినిమా తీసిన టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది.
జై భీమ్ తరహాలోనే మరోసారి సామాజిక అంశాలతో కథను అల్లుకున్నాడు జ్ఞానవేల్. రజినీ కూడా తన ఇమేజ్ను పక్కన పెట్టి విభిన్నమైన ప్రయత్నం చేశాడు. ఐతే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఇది తీసి పడేయదగ్గ మూవీ అయితే కాదు.
ఐతే సినిమా నచ్చకపోతే బాలేదు అని చెప్పాలి కానీ.. అదే పనిగా సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేయడం, నెగెటివ్ ట్రెండ్ చేయడమే విడ్డూరం. వేట్టయన్ సినిమా చూసి తాము మానసిక ప్రశాంతత కోల్పోయామని.. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒక రోజంతా నెగెటివ్ ట్రెండ్ చేశారు. Refundvettaiynticketmoney అనే హ్యాష్ ట్యాగ్ నిన్న ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ మీద దారుణమైన పోస్టులు పెట్టారు.
రజినీని కించపరిచే ప్రయత్నం చేశారు. ఇది ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ అభిమానుల పనే అని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా తమిళంలో విజయ్ హవా నడుస్తోంది. బాక్సాఫీస్ లెక్కల్లో రజినీని విజయ్ అధిగమించేశాడు. కానీ రజినీ అభిమానులు ఈ విషయాన్ని అంగీకరించరు.
వారితో విజయ్ అభిమానులకు గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజయ్ ఫ్యాన్స్ రజినీ సినిమా మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి రజినీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఐతే రజినీ లాంటి హీరో మీద కూడా ఇంత నెగెటివిటీ చూపించడం చూస్తే.. సోషల్ మీడియా దుష్పరిణామాలు ఎలాంటివో అర్థమవుతుంది.
This post was last modified on October 16, 2024 3:10 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…