Movie News

కీరవాణికి రెండు మెగా పరీక్షలు

ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన ఎంఎం కీరవాణి అవకాశాలు ఎన్ని వస్తున్నా ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్రిపులార్ తర్వాత సంగీతం అందించిన వాటిలో అధిక శాతం సంతృప్తినివ్వలేకపోయినా నా సామిరంగ లాంటి డీసెంట్ హిట్లు మరగతమణి (తమిళ పేరు) ని రేసులో ఉంచాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ఎస్ఎస్ఎంబి 29 మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా మొదలుకాలేదు కానీ వచ్చే 2025 మాత్రం ఆయనకు రెండు పెద్ద మెగా పరీక్షలు పెట్టబోతోంది. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో.

ఇప్పటిదాకా కీరవాణి తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ కి సంగీతం అందించలేదు. మొదటిసారి హరిహర వీరమల్లు రూపంలో అవకాశం తలుపు తట్టింది. దాని గ్రాండియర్ కు తగ్గట్టు బీజీఎమ్ కావాలని క్రిష్, ఏఎం రత్నం కోరిమరీ ఆయనను తీసుకున్నారు. మార్చి 28 విడుదల తేదీ ప్రకటించారు కాబట్టి డిసెంబర్ నుంచి రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టొచ్చు.

షూటింగ్ వచ్చే నెల పూర్తి కానుంది. డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ నటించిన మొదటి సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు. పాటల పరంగానూ ఆడియోకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ రెండూ అందుకుంటే పవర్ స్టార్ కాంబోకి న్యాయం జరుగుతోంది.

ఇక రెండో ఎగ్జామ్ చిరంజీవి విశ్వంభర. తొలుత అనుకున్న జనవరి విడుదలని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మే 9 డేట్ వినిపిస్తోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మెగాస్టార్ తో పని చేయడం కీరవాణికి కొత్త కాదు. వీళ్ళ కలయికలో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు లాంటి ఎక్స్ ట్రాడినరి మూవీస్ వచ్చాయి. ఎవర్ గ్రీన్ పాటలు నిలిచిపోయాయి. ఎస్పి పరశురామ్ మాత్రమే నిరాశపరిచింది. తిరిగి మూడు దశాబ్దాల తర్వాత విశ్వంభరతో కలుసుకున్నారు. మరి మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఒకేసారి  ఒకే సంవత్సరంలో ఎలాంటి సంగీతం ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. 

This post was last modified on October 16, 2024 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

26 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago