టాలీవుడ్ నుంచి కల్కి తర్వాత అత్యధిక అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమా.. దేవర. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా.. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లో భారీ వసూళ్లే సాధించింది. ఆ తర్వాత కొంచెం డల్ అయినట్లు కనిపించినా.. దసరా సెలవులను ఉపయోగించుకుని నిలకగా కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కూడా ఈ సినిమా రన్ కొనసాగుతోంది. కాకపోతే ప్రస్తుతం వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి.
ఐతే పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ దేవర మేజర్ వసూళ్లను తెలుగు వెర్షన్ నుంచే రాబట్టింది. 80 శాతం పైగా వసూళ్లు తెలుగు నుంచి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్లో, కర్ణాటకలో తెలుగు వెర్షన్ అదరగొట్టింది. కానీ సౌత్లో మిగతా చోట్ల దేవర పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ జనాలు దేవరను అంతగా పట్టించుకోలేదు. అక్కడ వసూళ్లు నామమాత్రం. మలయాళంలోనూ పరిస్థితి అంతంతమాత్రమే.
దేవర తెలుగులో కాకుండా ప్రభావం చూపింది హిందీలో మాత్రమే. అక్కడ ఈ సినిమా హిట్ రేంజిని అందుకుంది. పెద్దగా బజ్ లేకుండా రిలీజైన దేవర హిందీ వెర్షన్కు మాస్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. తొలి వీకెండ్లో రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది దేవర. ఆ ఊపు చూస్తే వంద కోట్ల మార్కును కూడా అందుకుంటుందా అనే చర్చ నడిచింది. కానీ దేవర ప్రస్తుతానికి హిందీలో రూ.65 కోట్లే కలెక్ట్ చేయగలిగింది. కానీ ఇది కూడా చిన్న నంబరేమీ కాదు.
విడుదలకు ముందు దేవరకు నార్త్ ఇండియాలో బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ నామమాత్రంగా కనిపించాయి. కానీ తొలి రోజు నుంచి సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాతో ఈ వసూళ్లు సాధించడం విశేషమే. తెలుగులో దేవర చాలా చోట్ల బయ్యర్లకు లాభాలు అందించింది. కొన్ని ఏరియాల్లో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్గా దేవరకు సంతృప్తికర ఫలితం వచ్చినట్లే.
This post was last modified on October 16, 2024 12:36 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…