సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న లైకా వందల కోట్ల బడ్జెట్లను విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది కానీ దానికి తగ్గ ఫలితాలను అందుకోవడం లేదు. ఆ మధ్య కమల్ హాసన్ ఇండియన్ 2 కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. దర్శకుడు శంకర్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలవగా బయ్యర్లకొచ్చిన నష్టాలకు రజనీకాంత్ వేట్టయన్ ని కొంచెం తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. తీరా చూస్తే సూపర్ స్టార్ కూడా నిరాశపరిచే విధంగానే బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించడం నిర్మాతలను ఖంగారు పెడుతోంది. పోస్టర్ల ద్వారా ఇస్తున్న ప్రకటనల్లో భారీ నెంబర్లు చూపిస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి వేరే ఉందని ట్రేడ్ టాక్.
తమిళంలో పర్వాలేదు కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో వేట్టయన్ చేతులు ఎత్తేస్తాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా వరస ఫ్లాపులు చూస్తున్న లైకాను మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 1, 2 రూపంలో పెద్ద హిట్లు ఇచ్చారు. ఒక తమిళ వెర్షన్ నుంచే పెట్టుబడి మొత్తం రికవర్ అయిపోగా నాన్ థియేట్రికల్ రెవిన్యూ నుంచి వచ్చిన సొమ్ములు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెట్టాయి. ఇవి కమల్ హాసన్, రజనీకాంత్ సంయుక్తంగా కరిగించేశారని చెన్నై వర్గాల గుసగుస. మధ్యలో లాల్ సలామ్ సైతం రజని ఇమేజ్ ని నమ్ముకుని తీసిందే. అది ఎంత దారుణమైన ఫ్లాప్ అంటే కనీసం ఓటిటిలో రాలేదు.
కేవలం స్టార్ పవర్ కలెక్షన్లను తీసుకురాదని మరోసారి రుజువయ్యిందిగా. కంటెంట్ వీక్ గా ఉంటే ఆడియన్స్ ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తారని కళ్లెదుట సాక్ష్యం కనిపిస్తోంది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్లో అజిత్ విదాముయార్చి నిర్మాణంలో ఉంది. ఇది కూడా ఆగుతూ సాగుతూ ఎప్పుడు విడుదలో అర్థం కానీ అయోమయంలో చిక్కుకుంది. దీనికన్నా చాలా ఆలస్యంగా మైత్రి వాళ్ళు మొదలుపెట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి రిలీజ్ అధికారికంగా ప్రకటించగా లైకా మాత్రం దసరా దీపావళి అంటూ వాయిదా పర్వం కొనసాగిస్తోంది. మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ ( లూసిఫర్ సీక్వెల్) ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on October 16, 2024 11:19 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…