Bhakti

గ‌ణ‌ప‌తి పందిరికి వంద‌ల కోట్ల బీమా

వినాయక చవితి ఉత్సవాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ముస్తాబవుతోంది. ముంబైలో అత్యంత ”సంపన్న” గణపతి మండపాన్ని గౌడ్ సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్ ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మంటపాన్ని అక్షరాలా రూ.316.40 కోట్లకు నిర్వాహకులు బీమా  చేశారు. గణేష్ విగ్రహానికి స్వర్ణాభారణాలు, ఇతర విలువైన ఆభరణతో సర్వాంగ సుందరంగా అలంకరించి మరీ జరుపనున్న ఈ ఉత్సవాలకు ఈ నెల 31న జీఎస్‌బీ శ్రీకారం చుడుతోంది. ఈ నేప‌థ్యంలో అగ్ని, చోర భ‌యాల నుంచి ర‌క్ష‌ణ‌గా బీమా చేయించిన‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు.

వినాయక మండపానికి, విలువైన ఆభరణాలకు, సిబ్బందికి…ఇలా అన్నింటికీ వివిధ రకాల ఇన్సూరెన్స్ లను న్యూ ఇండియా ఎస్యూరెన్స్ నుంచి జీఎస్‌బీ సేవా మండల్ తీసుకుంది. మొత్తం బీమా సొమ్ములో స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు, నగలకు రూ.31.97 కోట్ల బీమా తీసుకున్నారు. రూ.263 కోట్లకు వలంటీర్లు, పురోహితులు, వంటవాళ్లు, పాదరక్షల దుకాణ సిబ్బంది, వాలెట్ పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు పెర్సనల్ యాక్టింగ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంది.

ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లు, వంటపాత్రలు, గ్రాసరీ, పళ్లు, కూరగాయ‌లు సహా భూకంప రిస్క్ కవర్ తో స్టాండర్స్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ కింద రూ.కోటి రూపాయల బీమా తీసుకుంది. వేదక ప్రాంతంలో స్పెషల్ పెరిల్ పాలసీ ద్వారా రూ.77.5 లక్షల రిస్క్ కవర్ ఉంటుంది. మండపాలు, స్టేడియం, భక్తులకు రూ.20 కోట్ల మేరకు కవరేజ్ ఉంది.

కిలోల కొద్దీ బంగారం..

మహా గణపతిని 66 కేజీల స్వర్ణాభరణాలు, 295 కేజీలకు పైబడిన వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరించనున్నట్టు జీఎస్‌బీ సేవా మండల్ తెలిపింది. మట్టితో ఈ మహాగణపతిని రూపొందిస్తున్నారు. 2016లోనూ మహాగణపతి మండపానికి జీఎస్‌బీ సేవా సమితి రూ .300 కోట్లకు బీమా చేసింది. కాగా, ఈ ఏడాది మహాగణపతి ”విరాట్ దర్శన్” ను ఈనెల 29న అట్టహాసంగా జరిపేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

This post was last modified on August 23, 2022 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago