అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఇది ఏప్రిల్ 30న రావడం విశేషం. ఈ రోజును విశేష శుభదినంగా పరిగణించి, లక్ష్మీదేవిని కృప పొందే ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు సంపదకు సూచికగా బంగారం, వెండి కొనడం వల్ల ఐశ్వర్యం వస్తుందన్న నమ్మకంతో చాలామంది నగలు కొనడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
దీపం ప్రాముఖ్యత:
ఈరోజు దేవతలను సంతోషపెట్టే విధంగా ఇంట్లో దీపాలను వెలిగించడం విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. ఇంట్లో ఉత్తర దిశను సంపద దిశగా పరిగణించడం వల్ల, అక్కడ దీపం వెలిగించడం ద్వారా శ్రేయస్సు, శాంతి, ధనసంపదలు కలుగుతాయని నమ్మకం. కుబేరుడు, లక్ష్మీదేవి దిశగా ఉత్తర దిశను పరిగణిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం పెట్టడం లక్ష్మీప్రజంగా భావిస్తారు.
అలానే, వంటగదిలో త్రాగునీరు నిల్వ చేసే ప్రదేశంలో దీపం వెలిగించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసించబడుతోంది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోయే అవకాశముందని చెబుతారు. ఇంటి వద్ద బావి లేదా చెరువు వంటి నీటి వనరులు ఉంటే, వాటి సమీపంలో దీపాలు వెలిగించటం ద్వారా ప్రకృతికి కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది.
ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు వైపులా నెయ్యితో మట్టి దీపాలను వెలిగిస్తే, లక్ష్మీదేవి ఆ గృహంలో ప్రవేశిస్తుందని విశ్వాసం. శుభ్రత, వెలుగుతో కూడిన వాతావరణాన్ని దేవతలు ఇష్టపడతారని భావించడంతో,గడపకు పసుపు పూసే ముగ్గులు పెట్టి, దీపాలను వెలిగిస్తే ధనసంపద పెరుగుతుందని నమ్ముతారు.ఈరోజు చేసే శుభకార్యాలకు శాశ్వత ఫలితాలు కలుగుతాయని విశ్వసించే ప్రజలు, అక్షయ తృతీయను అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు.
గమనిక: పై సమాచారం కేవలం పాటకుల ఆసక్తి మేరకు అందించాము. ఇవి పలువురు పండితులు, ఆన్లైన్ సమాచారం ఆధారంగా అందించడం జరిగింది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…