అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఇది ఏప్రిల్ 30న రావడం విశేషం. ఈ రోజును విశేష శుభదినంగా పరిగణించి, లక్ష్మీదేవిని కృప పొందే ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు సంపదకు సూచికగా బంగారం, వెండి కొనడం వల్ల ఐశ్వర్యం వస్తుందన్న నమ్మకంతో చాలామంది నగలు కొనడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
దీపం ప్రాముఖ్యత:
ఈరోజు దేవతలను సంతోషపెట్టే విధంగా ఇంట్లో దీపాలను వెలిగించడం విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. ఇంట్లో ఉత్తర దిశను సంపద దిశగా పరిగణించడం వల్ల, అక్కడ దీపం వెలిగించడం ద్వారా శ్రేయస్సు, శాంతి, ధనసంపదలు కలుగుతాయని నమ్మకం. కుబేరుడు, లక్ష్మీదేవి దిశగా ఉత్తర దిశను పరిగణిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం పెట్టడం లక్ష్మీప్రజంగా భావిస్తారు.
అలానే, వంటగదిలో త్రాగునీరు నిల్వ చేసే ప్రదేశంలో దీపం వెలిగించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసించబడుతోంది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోయే అవకాశముందని చెబుతారు. ఇంటి వద్ద బావి లేదా చెరువు వంటి నీటి వనరులు ఉంటే, వాటి సమీపంలో దీపాలు వెలిగించటం ద్వారా ప్రకృతికి కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది.
ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు వైపులా నెయ్యితో మట్టి దీపాలను వెలిగిస్తే, లక్ష్మీదేవి ఆ గృహంలో ప్రవేశిస్తుందని విశ్వాసం. శుభ్రత, వెలుగుతో కూడిన వాతావరణాన్ని దేవతలు ఇష్టపడతారని భావించడంతో,గడపకు పసుపు పూసే ముగ్గులు పెట్టి, దీపాలను వెలిగిస్తే ధనసంపద పెరుగుతుందని నమ్ముతారు.ఈరోజు చేసే శుభకార్యాలకు శాశ్వత ఫలితాలు కలుగుతాయని విశ్వసించే ప్రజలు, అక్షయ తృతీయను అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు.
గమనిక: పై సమాచారం కేవలం పాటకుల ఆసక్తి మేరకు అందించాము. ఇవి పలువురు పండితులు, ఆన్లైన్ సమాచారం ఆధారంగా అందించడం జరిగింది.
This post was last modified on April 21, 2025 2:31 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…