‘నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు’

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది క‌దా.. అని ఇష్టం వ‌చ్చిన ట్టు మాట్లాడ‌ద్దంటూ.. గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. తాను మాట్లాడ‌డం మొద‌లు పెడితే.. చాలా ఇబ్బంది ప‌డ‌తావ్! అంటూ వ్యాఖ్యానిం చారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మ‌చీలీప‌ట్నంలో టీడీపీ-జ‌న‌సేన సంయుక్తంగా నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఆసాంతం నిప్పులు చెరిగారు. తాను భీమవ‌రం నుంచి పిఠాపురానికి నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుంటే.. సీఎం జ‌గ‌న్‌కు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న 70 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు మార్చాడో స‌మాధానం చెప్పాల‌న్నారు.

త‌న కుటుంబంపైనా..త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పైనా నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడ‌ని.. తాను కూడా మాట్లాడాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. “క్లాస్ వార్‌-మాస్‌వార్ అంటున్నాడు(జ‌గ‌న్‌).. ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డ‌మే క్లాస్ వార్. ఇది మేం చేయ‌లేదు. నువ్వే చేశావు. ఐదేళ్లు అన్ని విధాలా ప్ర‌జ‌ల‌ను దోచేసి.. ఇప్పుడు క‌బుర్లు చెబుతున్నాడు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అధికారం చేప‌డుతూనే ప్ర‌జావేదిక కూల్చేయ‌లేదా? అని ప్ర‌శ్నించారు.

పోలీసుల‌కు వీక్లీఆఫ్‌ల ఎర చూపి.. వారిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని చివ‌ర‌కు మోసం చేశాడ‌ని అన్నారు. మ‌త్స్యకారుల‌ను మోసం చేసేందుకు జీవో 217 తీసుకువ‌చ్చాడ‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇసుక‌ను దోచుకుని.. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను అడ్డంగా ముంచేశాడ‌న్నారు. వారు దాచుకున్న డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఆయ‌న నోరు డ్రైనేజీ!

ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో మంత్రి, పెడ‌న ఎమ్మెల్యే(ప్ర‌స్తుతం పెన‌మ‌లూరు నుంచి పోటీ చేస్తున్నారు) జోగి ర‌మేష్‌పై పేరు ఎత్త‌కుండానే.. విరుచుకుప‌డ్డారు. “ఇక్క‌డి ఎమ్మెల్యే దోపిడీ దారుడ‌ని అంద‌రూ చెబుతున్నారు. ఆయ‌న నోరు విప్పితే.. బూతులు.. ఇంటి ముందు డ్రైనేజీ బాగు చేయ‌డం చేత‌కాదు.. ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌వి. ఆ య‌న నోరే పెద్ద డ్రైనేజీ. అందిన‌కాడికి అంద‌రి నుంచి దోచేశాడు. రైతులు, చిన్న చిన్న‌వ్యాపారుల నుంచి దండుకున్నాడు. వీళ్లు మాకునీతులు చెబుతున్నారు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక్క‌డ అభివృద్ధిని ప్ర‌శ్నించిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై గంజాయి కేసులు పెట్టించార‌ని అన్నారు. అయినా.. త‌మ సైనికులు వెర‌వ‌కుండా ముందుకు సాగార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.