హైదరాబాద్లోని విద్యార్థులకు, బుల్లితెర నటీనటులకు సహా.. కొందరికి డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి(32)ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న మస్తాన్.. గుంటూరులో డ్రగ్స్ డెన్ను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఆయన కోసం కొన్నాళ్లుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వెలుగు చూసి.. తీవ్ర దుమారం రేపిన నటుడు రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారంలోనూ మస్తాన్ పేరు వినిపించింది. లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసింది మస్తానేనని పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున యువతులతో పోర్న్ వీడియోలు తీయిస్తున్నట్టు కూడా గుర్తించారు.
అంతేకాదు.. లావణ్య-మస్తాన్లు సహజీవనం చేసినట్టు కూడా ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే అప్పట్నుంచి మస్తాన్ కనిపించకుండా పోవడంతో హైదరాబాద్ పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ దర్గాలో ఉన్నట్టు గుర్తించి తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని డ్రగ్స్కు సంబంధించిన కూపీ లాగుతున్నారు. ఇతని ఫోన్లో వందల మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలను నగ్నంగా వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది.
భారీ బిజినెస్
మద్యంతోపాటు.. పోర్న్ వీడియోల వ్యాపారం కూడా మస్తాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణకు చెందిన యువతులను టార్గెట్ చేసుకుని, వారి బలహీనతలను గుర్తించి.. సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సిని మా అవకాశాలు ఇప్పిస్తానంటూ.. యువతులను లొంగదీసుకుని పోర్న్ వీడియోలు చేయించిన ఘటనలు, వారిని డ్రగ్స్ ఊబిలోకి లాగిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే లావణ్య కూడా మస్తాన్ వలలో చిక్కినట్టు తెలుస్తోంది. ఇక, డ్రగ్స్ వ్యాపారంలో మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా మస్తాన్ దూసుకుపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని అరెస్టు చేయడం ద్వారా.. ఒక పెద్ద సవాల్కు చెక్ పెట్టినట్టు అయిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on August 12, 2024 10:30 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…