Trends

షాకింగ్‌.. 14 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ న‌ష్టాలు!

క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా భార‌త మార్కెట్లు దారుణ ప‌రిస్థితుల‌ను చ‌వి చూస్తున్నాయి. సోమ‌వారం మార్కెట్లు ప్రారంభం అవుతూనే.. న‌ష్టాల బాట ప‌ట్టాయి. సెన్సెక్స్ నుంచి నిఫ్టీ వ‌ర‌కు.. బీఎస్ఈలో న‌మోదైన అన్ని సంస్థ‌లు కూడా మార్కెట్‌లో న‌ష్టాలు చ‌వి చూస్తున్నాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల మ‌ధ్య ఏకంగా 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మ‌దుపరుల సంప‌ద తుడిచి పెట్టుకుపోయింది.

ప్ర‌ఖ్యాత కంపెనీలు కూడా..

ప్ర‌ఖ్యాత కంపెనీలైన టాటా మోటార్స్‌, స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతి, మ‌హింద్రా, ఎస్‌బీఐ స‌హా.. ఇత‌ర బ్రాండ్లు కూడా తీవ్ర న‌ష్టాల్లో ఉన్నాయి. వీటిలో అదానీకి చెందిన పోర్ట్స్ కూడా తొలి సారి న‌ష్టాల్లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అంబానీకి చెందిన రిల‌య‌న్స్‌కూడా.. 3.3 శాతం షేర్లు భారీ న‌ష్టాల్లో ఉంది. ఇక‌, టాటా స్టీల్ 3.5 శాతం, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ 3.3 శాతం న‌ష్టాల‌లో కొన‌సాగుతున్నాయి. దీంతో సోమ‌వారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున కుంగిపోయింద‌నే చెప్పాలి.

ఎందుకిలా?

అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న స‌వాళ్లు, ప్ర‌పంచ యుద్ధం ముప్పు వంటివి స్టాక్ మార్కెట్‌పై ప్ర‌భావం చూపు తున్న‌ట్టు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు అమెరికాలో ఎన్నిక‌లు, ఆర్థిక మాంద్యం, చైనాలో నిరుద్యోగం తీవ్ర‌త వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్నాయ‌ని చెబుతున్నారు. అలానే పెరుగుతున్న వ‌డ్డీ రేట్లు కూడా మార్కెట్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్ త‌మ వ‌డ్డీ రేట్ల‌ను పావ‌లా చొప్పున పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను దాదాపు నిలిపి వేసింది.

దీంతో జ‌పాన్ క‌రెన్సీ ‘యెన్‌’ బలపడింది. దీంతో నష్టాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు పెట్టుబ‌డి దారులు త‌మ వాటాల‌ను అమ్మేయ‌డం ప్రారంభించారు. దీంతో ‘టెక్‌ స్టాక్స్‌’లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీని ప్రభావం ఆసియా దేశాలు సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. భార‌త్‌పై మ‌రింత ప్ర‌భావం చూపిస్తోంది. ఎలా చూసుకున్నా.. 14 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద అయితే ఆవిరై పోయింది. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం సంప‌ద ఆవిరి కావ‌డం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago