Trends

షాకింగ్‌.. 14 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ న‌ష్టాలు!

క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా భార‌త మార్కెట్లు దారుణ ప‌రిస్థితుల‌ను చ‌వి చూస్తున్నాయి. సోమ‌వారం మార్కెట్లు ప్రారంభం అవుతూనే.. న‌ష్టాల బాట ప‌ట్టాయి. సెన్సెక్స్ నుంచి నిఫ్టీ వ‌ర‌కు.. బీఎస్ఈలో న‌మోదైన అన్ని సంస్థ‌లు కూడా మార్కెట్‌లో న‌ష్టాలు చ‌వి చూస్తున్నాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల మ‌ధ్య ఏకంగా 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మ‌దుపరుల సంప‌ద తుడిచి పెట్టుకుపోయింది.

ప్ర‌ఖ్యాత కంపెనీలు కూడా..

ప్ర‌ఖ్యాత కంపెనీలైన టాటా మోటార్స్‌, స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతి, మ‌హింద్రా, ఎస్‌బీఐ స‌హా.. ఇత‌ర బ్రాండ్లు కూడా తీవ్ర న‌ష్టాల్లో ఉన్నాయి. వీటిలో అదానీకి చెందిన పోర్ట్స్ కూడా తొలి సారి న‌ష్టాల్లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అంబానీకి చెందిన రిల‌య‌న్స్‌కూడా.. 3.3 శాతం షేర్లు భారీ న‌ష్టాల్లో ఉంది. ఇక‌, టాటా స్టీల్ 3.5 శాతం, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ 3.3 శాతం న‌ష్టాల‌లో కొన‌సాగుతున్నాయి. దీంతో సోమ‌వారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున కుంగిపోయింద‌నే చెప్పాలి.

ఎందుకిలా?

అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న స‌వాళ్లు, ప్ర‌పంచ యుద్ధం ముప్పు వంటివి స్టాక్ మార్కెట్‌పై ప్ర‌భావం చూపు తున్న‌ట్టు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు అమెరికాలో ఎన్నిక‌లు, ఆర్థిక మాంద్యం, చైనాలో నిరుద్యోగం తీవ్ర‌త వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్నాయ‌ని చెబుతున్నారు. అలానే పెరుగుతున్న వ‌డ్డీ రేట్లు కూడా మార్కెట్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్ త‌మ వ‌డ్డీ రేట్ల‌ను పావ‌లా చొప్పున పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను దాదాపు నిలిపి వేసింది.

దీంతో జ‌పాన్ క‌రెన్సీ ‘యెన్‌’ బలపడింది. దీంతో నష్టాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు పెట్టుబ‌డి దారులు త‌మ వాటాల‌ను అమ్మేయ‌డం ప్రారంభించారు. దీంతో ‘టెక్‌ స్టాక్స్‌’లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీని ప్రభావం ఆసియా దేశాలు సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. భార‌త్‌పై మ‌రింత ప్ర‌భావం చూపిస్తోంది. ఎలా చూసుకున్నా.. 14 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద అయితే ఆవిరై పోయింది. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం సంప‌ద ఆవిరి కావ‌డం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago