టీమ్ ఇండియా తరఫున విరాట్ కోహ్లి విజయవంతమైన కెప్టెన్. అతడి నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. టెస్టుల్లో నంబర్ వన్ కూడా అయింది. కానీ ఐపీఎల్లో మాత్రం కోహ్లీ జట్టు అంటే అందరూ చాలా కామెడీగా చూస్తారు. ఐపీఎల్లో కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా కెప్టెన్గా ఆ జట్టును నడిపిస్తున్నాడు.
ఐతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ జట్టు కప్పు గెలవలేదు. గతంలో కోహ్లి నాయకత్వంలో రెండుసార్లు, కుంబ్లే నాయకత్వంలో ఒకసారి ఫైనల్ చేరినా కప్పు మాత్రం గెలవలేకపోయారు. ఐతే కొన్నేళ్లుగా ఆ జట్టు ప్రదర్శన పేలవం. ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోతోంది. పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది వరుసలో ఉంటోంది. ప్రతిసారీ ‘ఈసాలా కప్ నమదే’ అని బెంగళూరు అభిమానులు అనడం.. తీరా ఆ జట్లు ప్రదర్శన చూస్తే తీసికట్టుగా ఉండటం.. ఇదీ వరస.
ఎప్పట్లాగే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు తమ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచ్లో కొంచెం కష్టపడి అయినా సరే.. సన్రైజర్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఈసారి ఆర్సీబీ రాత మారుతోందని ఆశపడ్డారు. కానీ రెండో మ్యాచ్కు వచ్చేసరికి ఆ జట్టు ‘ఒరిజినల్ ఫామ్’ను అందుకుంది. పంజాబ్తో మ్యాచ్లో ఘోరంగా ఆడి దాదాపు వంద పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జట్టు ప్రదర్శనకు మించి కోహ్లి పెర్ఫామెన్స్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
తొలి మ్యాచ్లో ఫెయిలైతే.. ఒక మ్యాచ్ వైఫల్యమే కదా అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్లో 200 పైచిలుకు లక్ష్యం ముందుండగా కోహ్లి పేలవంగా ఆడి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ అన్ని రకాలుగానూ విఫలమయ్యాడు. కెప్టెన్గా క్లూలెస్గా కనిపించాడు. రాహుల్ను ఆపడంలో తేలిపోయాడు. స్వయంగా అతను రాహుల్ ఇచ్చిన తేలికైన క్యాచ్లు రెండు వదిలేయడం అభిమానులకు పెద్ద షాక్. ఇంతకుముందు జట్టు ఫెయిలైనా కోహ్లి సక్సెస్ అయ్యేవాడు. కానీ ఈసారి రెండు మ్యాచ్ల్లోనూ విరాట్ పేలవ ప్రదర్శన చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అతడి మీద సోషల్ మీడియాలో బోలెడంత ట్రోలింగ్ జరుగుతోంది. మీమ్స్ ఓ రేంజిలో పేలుతున్నాయి.
This post was last modified on September 26, 2020 9:22 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…