పారిస్లో ఒలింపిక్స్ ఉత్సాహభరితంగా జరుగుతున్న వేళ ఒక ఉదంతం సంచలనం రేపుతోంది. ఇటలీ బాక్సర్ యాంజెలా ఉన్నట్లుండి బౌట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలిఫ్తో బౌట్ మొదలైన 40 సెకండ్లకే యాంజెలా రింగ్ నుంచి నిష్క్రమించింది. అలా అని ఆమె నేమీ ఖెలిఫ్ నాకౌట్ చేయలేదు. గట్టి దెబ్బ తగిలి కోలుకోలేని స్థితిలో ఉంటే బాక్సర్లు నాకౌట్ అయి నిష్క్రమిస్తారు. కానీ ఇక్కడ అలా ఏమీ జరగలేదు.
ఖెలిఫ్ నుంచి యాంజెలా రెండు గట్టి పంచ్లు తిన్న మాట వాస్తవమే. ఒక పంచ్కు ఆమె ముక్కు పగిలి రక్తం వచ్చింది. అలా అని యాంజెలా బౌట్లో కొనసాగలేని స్థితిలో లేదు. అయినా నేనీ బౌట్ ఆడను అంటూ ఆమె వైదొలిగింది. ఇందుకు కారణం ఏంటి అని ఆమె వెల్లడించకపోయినా.. కన్నీళ్లతో ఆమె నిష్క్రమించిన తీరును బట్టి అందరికీ విషయం అర్థమైపోయింది.
ఖెలిఫ్లో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం గతంలో వెల్లడైంది. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సమయంలో ఖెలిఫ్కు పరీక్షలు నిర్వహించగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో ఆమెను పోటీల నుంచి నిష్క్రమించారు. ఐతే ఒలింపిక్స్కు ఆ రూల్స్ వర్తించవు. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా.. మహిళ మహిళే అనే ఉద్దేశంతో ఇలాంటి వారిని పోటీలకు అనుమతిస్తున్నారు. కానీ కండలు తిరిగిన ఖెలిఫ్ ఫిజిక్, తన లాంగ్వేజ్ చూస్తే అబ్బాయిలాగే కనిపిస్తుంది.
ఖెలిఫ్ ఇచ్చిన పంచ్ గురించి యాంజెలా మాట్లాడుతూ.. ఇంత బలమైన పంచ్ తన జీవితంలో ఎదుర్కోలేదని పేర్కొంది. అమ్మాయిలకు ఇలాంటి పంచ్ సాధ్యం కాదన్న రీతిలో ఆమె మాట్లాడింది. ఆమె ఖెలిఫ్ మీద నేరుగా ఆరోపణలు చేయకపోయినా, తాను వైదొలగడానికి ఆమెలో పురుష లక్షణాలు ఎక్కువ ఉండడమే కారణం అని చెప్పకపోయినా.. ప్రపంచం మాత్రం ఆ రకంగానే విషయాన్ని అర్థం చేసుకుంది. ‘ఎక్స్’ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సహా చాలామంది.. మహిళల ఈవెంట్లో పురుషులను ఎలా ఆడిస్తారంటూ ప్రశ్నించారు. యాంజెలా-ఖెలిఫ్ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేసింది. నిన్నట్నుంచి ఒలింపిక్స్కు సంబంధించి మిగతా విషయాలకంటే ఇదే హాట్ టాపిక్గా మారింది. తైవాన్కు చెందిన లిన్ యు టింగ్ సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది.
This post was last modified on August 2, 2024 2:33 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…