దేశీయ టెలికాం రంగంలో జియో ఇప్పటికే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1 జీబీ ఇంటర్నెట్ డేటా కోసం పెట్టే ఖర్చుతో నెల మొత్తానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రకంపనలు రేపింది జియో. దెబ్బకు కోట్ల మంది జియో వైపు మళ్లాయరు. ఇతర నెట్వర్క్లన్నీ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి అవి కూడా తగ్గి జియోతో సమానంగా ఆఫర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచెం అటు ఇటుగా అన్ని నెట్వర్క్ల ప్లాన్లూ ఒకేలా ఉన్నాయిప్పుడు.
ఐతే ఇప్పుడు జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతో కొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. ప్లాన్ను బట్టి రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెట్ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ-హాట్స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీల సబ్స్క్రిప్షన్తో పాటుగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్, తొలిసారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ, డేటా రోల్ఓవర్, వైఫై కాలింగ్ తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్లాన్లను డిజైన్ చేసింది. ఈనెల 24 నుంచి జియో స్టోర్లలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఐతే మిగతా సౌకర్యాల సంగతెలా ఉన్నప్పటికీ.. 399 రూపాయలకు అన్ లిమిటెడ్ కాల్స్, అవసరం మేరకు ఇంటర్నెట్ డేటా ఇస్తూ నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఇస్తే.. అదొక సంచలనం కావడం ఖాయం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లలో మెజారిటీని ఈ ప్లాన్ కచ్చితంగా ఆకర్షిస్తుంది. దీంతో మరోసారి జియో అవతలి నెట్వర్క్ల కస్టమర్లను లాగేయడం ఖాయం. మరోవైపు రూ.4 వేలకే జియో స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయడానికి కూడా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారట.
This post was last modified on September 23, 2020 2:59 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…