Trends

జియో మరో సంచలనం

దేశీయ టెలికాం రంగంలో జియో ఇప్పటికే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1 జీబీ ఇంటర్నెట్ డేటా కోసం పెట్టే ఖర్చుతో నెల మొత్తానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రకంపనలు రేపింది జియో. దెబ్బకు కోట్ల మంది జియో వైపు మళ్లాయరు. ఇతర నెట్‌వర్క్‌లన్నీ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి అవి కూడా తగ్గి జియోతో సమానంగా ఆఫర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచెం అటు ఇటుగా అన్ని నెట్‌వర్క్‌ల ప్లాన్లూ ఒకేలా ఉన్నాయిప్పుడు.

ఐతే ఇప్పుడు జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతో కొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. ప్లాన్‌ను బట్టి రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్‌, డిస్నీ-హాట్‌స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌, తొలిసారిగా ఇన్‌ ఫ్లైట్‌ కనెక్టివిటీ, డేటా రోల్‌ఓవర్‌, వైఫై కాలింగ్‌ తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్లాన్లను డిజైన్‌ చేసింది. ఈనెల 24 నుంచి జియో స్టోర్లలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఐతే మిగతా సౌకర్యాల సంగతెలా ఉన్నప్పటికీ.. 399 రూపాయలకు అన్ లిమిటెడ్ కాల్స్, అవసరం మేరకు ఇంటర్నెట్ డేటా ఇస్తూ నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తే.. అదొక సంచలనం కావడం ఖాయం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లలో మెజారిటీని ఈ ప్లాన్ కచ్చితంగా ఆకర్షిస్తుంది. దీంతో మరోసారి జియో అవతలి నెట్‌వర్క్‌ల కస్టమర్లను లాగేయడం ఖాయం. మరోవైపు రూ.4 వేలకే జియో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి కూడా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్‌లను తయారు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారట.

This post was last modified on September 23, 2020 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

60 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago