సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ తెలిసిందే. ఆయన హైటెక్ స్వామిగా పేరొందారు. సినీ తారలు, క్రికెటర్లకు ఆయన జోస్యాలు చెబుతుంటారు. జాతకాలు కూడా చెబుతుంటారు. ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు.
ఇటీవల నెల రోజుల కిందట ఓ సినీ తార జాతకంలో దోషం పోవాలని ఆకాంక్షిస్తూ… మద్యంతో ప్రత్యేక హోమం చేయించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర విమర్శలకు కూడా దారి తీసింది. ఆ తర్వాత.. కూడా ఆయన అనేక మంది జాతకాలతో.. ఫేమస్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు ముందు.. వేణు స్వామి.. పెద్ద సంచలనం అయ్యారు. “నేను చెప్తున్న కదా.. ఏపీలో మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతరు. రాసిపెట్టుకో” అంటూ తన తెలంగాణ యాసలో ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూలను ఇరగదీశారు. ఈ క్రమంలో జగన్ జాతకాన్ని కూడా ఆయన వివరించారు. జగన్కు ఉన్న దోషం పోయిందని.. ఇప్పుడు ఆయన గ్రహాలన్నీ ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నాయని చెప్పారు. అందుకే.. రాజయోగం.. కొనసాగుతుందని అన్నారు. మొత్తంగా వేణు స్వామి చెప్పిన ఈ వీడియోను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే వైసీపీ నాయకులను వేణు స్వామి హడలెత్తిస్తున్నారు. దీనికి కారణం.. తాజాగా ఆయన చెప్పిన జాతకం.. జోస్యం వంటివి ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు వేణు స్వామి పేరు ఎత్తేందుకు కూడా.. వైసీపీ నాయకులు హడలి పోతున్నారు.
తాజాగా ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కు మధ్య పోరు జరిగిన విషయం తెలిసిందే. దీనికి ముందు వేణు స్వామి మాట్లాడుతూ… పక్కాగా హైదరాబాద్ గెలిచి తీరుతుందని.. రాసిపెట్టుకోవాలని .. సవాల్ రువ్వారు.
కానీ, చివరకు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దీనిని టీడీపీ నేతలు.. ట్రోల్ చేస్తున్నారు. రేపు వైసీపీ పరిస్థితి కూడా ఇంతే అంటూ కామెంట్లు చేస్తూ.. పైన వేణు స్వామి చెప్పింది పోస్టు చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులకు నోట మాట రావడం లేదు. మరి వేణు స్వామి చెప్పింది.. ఏపీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 28, 2024 7:24 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…