సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ తెలిసిందే. ఆయన హైటెక్ స్వామిగా పేరొందారు. సినీ తారలు, క్రికెటర్లకు ఆయన జోస్యాలు చెబుతుంటారు. జాతకాలు కూడా చెబుతుంటారు. ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు.
ఇటీవల నెల రోజుల కిందట ఓ సినీ తార జాతకంలో దోషం పోవాలని ఆకాంక్షిస్తూ… మద్యంతో ప్రత్యేక హోమం చేయించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర విమర్శలకు కూడా దారి తీసింది. ఆ తర్వాత.. కూడా ఆయన అనేక మంది జాతకాలతో.. ఫేమస్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు ముందు.. వేణు స్వామి.. పెద్ద సంచలనం అయ్యారు. “నేను చెప్తున్న కదా.. ఏపీలో మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతరు. రాసిపెట్టుకో” అంటూ తన తెలంగాణ యాసలో ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూలను ఇరగదీశారు. ఈ క్రమంలో జగన్ జాతకాన్ని కూడా ఆయన వివరించారు. జగన్కు ఉన్న దోషం పోయిందని.. ఇప్పుడు ఆయన గ్రహాలన్నీ ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నాయని చెప్పారు. అందుకే.. రాజయోగం.. కొనసాగుతుందని అన్నారు. మొత్తంగా వేణు స్వామి చెప్పిన ఈ వీడియోను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే వైసీపీ నాయకులను వేణు స్వామి హడలెత్తిస్తున్నారు. దీనికి కారణం.. తాజాగా ఆయన చెప్పిన జాతకం.. జోస్యం వంటివి ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు వేణు స్వామి పేరు ఎత్తేందుకు కూడా.. వైసీపీ నాయకులు హడలి పోతున్నారు.
తాజాగా ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కు మధ్య పోరు జరిగిన విషయం తెలిసిందే. దీనికి ముందు వేణు స్వామి మాట్లాడుతూ… పక్కాగా హైదరాబాద్ గెలిచి తీరుతుందని.. రాసిపెట్టుకోవాలని .. సవాల్ రువ్వారు.
కానీ, చివరకు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దీనిని టీడీపీ నేతలు.. ట్రోల్ చేస్తున్నారు. రేపు వైసీపీ పరిస్థితి కూడా ఇంతే అంటూ కామెంట్లు చేస్తూ.. పైన వేణు స్వామి చెప్పింది పోస్టు చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులకు నోట మాట రావడం లేదు. మరి వేణు స్వామి చెప్పింది.. ఏపీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 28, 2024 7:24 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ…
తమిళంలో సినిమాల పరంగా చాలా ఏళ్ల నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ అభిమానుల మధ్య వైరం ఉంది.…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో తన నలభై ఏళ్ల బంధాన్ని తెంచుకుని మరీ బీఆర్ఎస్ గూటికి చేరువవుతున్నారు తెలంగాణ…
ఈ రోజుల్లో సినిమాల్లో సందేశాలు ఇస్తే..ఎవరు తీసుకుంటారు? మంచి చూపిస్తే ఎవరు నేర్చుకుంటారు అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. అలాంటి…
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు హీరోయిన్లకు దక్కడం చాలా అరుదైపోయింది. రష్మిక మందన్నకు గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు…