Trends

వైసీపీని హ‌డ‌లెత్తించిన‌.. ‘వేణు స్వామి!’

సెల‌బ్రిటీల జాత‌కాలు చెప్పే వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హైటెక్ స్వామిగా పేరొందారు. సినీ తార‌లు, క్రికెట‌ర్ల‌కు ఆయ‌న జోస్యాలు చెబుతుంటారు. జాత‌కాలు కూడా చెబుతుంటారు. ప్ర‌త్యేకంగా పూజ‌లు కూడా చేస్తుంటారు.

ఇటీవ‌ల నెల రోజుల కింద‌ట ఓ సినీ తార జాత‌కంలో దోషం పోవాల‌ని ఆకాంక్షిస్తూ… మ‌ద్యంతో ప్ర‌త్యేక హోమం చేయించిన విష‌యం తెలిసిందే. ఇది తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కూడా దారి తీసింది. ఆ త‌ర్వాత‌.. కూడా ఆయ‌న అనేక మంది జాత‌కాల‌తో.. ఫేమ‌స్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఏపీ ఎన్నిక‌ల‌కు ముందు.. వేణు స్వామి.. పెద్ద సంచ‌ల‌నం అయ్యారు. “నేను చెప్తున్న క‌దా.. ఏపీలో మ‌ళ్లీ జ‌గ‌న్ గారే ముఖ్య‌మంత్రి అవుత‌రు. రాసిపెట్టుకో” అంటూ త‌న తెలంగాణ యాస‌లో ఆయ‌న యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌ను ఇర‌గ‌దీశారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జాత‌కాన్ని కూడా ఆయ‌న వివ‌రించారు. జ‌గ‌న్‌కు ఉన్న దోషం పోయింద‌ని.. ఇప్పుడు ఆయ‌న గ్ర‌హాల‌న్నీ ఉచ్ఛ స్థితిలో కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. అందుకే.. రాజ‌యోగం.. కొన‌సాగుతుంద‌ని అన్నారు. మొత్తంగా వేణు స్వామి చెప్పిన ఈ వీడియోను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున వైర‌ల్ చేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే వైసీపీ నాయ‌కులను వేణు స్వామి హ‌డ‌లెత్తిస్తున్నారు. దీనికి కార‌ణం.. తాజాగా ఆయ‌న చెప్పిన జాతకం.. జోస్యం వంటివి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు వేణు స్వామి పేరు ఎత్తేందుకు కూడా.. వైసీపీ నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారు.

తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు మ‌ధ్య పోరు జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీనికి ముందు వేణు స్వామి మాట్లాడుతూ… ప‌క్కాగా హైద‌రాబాద్ గెలిచి తీరుతుంద‌ని.. రాసిపెట్టుకోవాల‌ని .. స‌వాల్ రువ్వారు.

కానీ, చివ‌ర‌కు ఐపీఎల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దీనిని టీడీపీ నేత‌లు.. ట్రోల్ చేస్తున్నారు. రేపు వైసీపీ ప‌రిస్థితి కూడా ఇంతే అంటూ కామెంట్లు చేస్తూ.. పైన వేణు స్వామి చెప్పింది పోస్టు చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయ‌కుల‌కు నోట మాట రావ‌డం లేదు. మ‌రి వేణు స్వామి చెప్పింది.. ఏపీ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

20 minutes ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

46 minutes ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

56 minutes ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

3 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

4 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

6 hours ago