కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం తెరమీదికి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి ఇక్కడి ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలిసింది. దీనిని స్థానిక సీసీబీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని నటి.. హేమ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. ఆమె దీనిని ఖండించారు. తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తననుఅనవసరంగా ఈ రొచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
అంతేకాదు.. తాను ఆదివారం హైదరాబాద్లోనే ఉన్నానని.. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని హేమ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తన అభిమానులు ఎవరూ నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా కూడా.. నియంత్రణ పాటించాలన్నారు. ఇక, ఈ పార్టీలో మరో కీలక అంశం.. వైసీపీ మంత్రి కారు పట్టబడడం. వైసీపీ కీలక నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి స్టిక్కర్తో ఉన్న కారును రేవ్పార్టీని కట్టడి చేసేందుకు వచ్చిన పోలీసులు గుర్తించారు.
ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పలువురు తారలు, ప్రముఖుల కార్లను కూడా.. పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు గుర్తించారు. ఆదిశగానే ఇప్పుడు విచారణ చేపట్టారు. ఇక, ఒక ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్లో ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్న తెలిపారు. కాగా.. ఈ పార్టీకి వచ్చిన వారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుర్తించారు.
This post was last modified on May 20, 2024 3:34 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…