Trends

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్‌ కుమార్‌(28) బెట్టింగ్‌, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌లో ముకేశ్‌ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు.

ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో బెట్టింగ్ యాప్ ల కారణంగా యువత తమ ప్రాణాలను కోల్పోతున్నది. అనేక మంది యువత వీటి బారినపడి ఆస్తులతో పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నది.

This post was last modified on May 12, 2024 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

43 minutes ago

ఎన్నిసార్లు చెప్పాలి.. సీనియ‌ర్ న‌టి అస‌హ‌నం

90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…

2 hours ago

తెలుగు సినిమాలపై తాప్సి మళ్లీ…

ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…

2 hours ago

ప్రకాష్ రాజ్ బీఫ్ కామెంట్లపై దుమారం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…

3 hours ago

పసి బాలురపై అకృత్యాలు.. దంపతులకు మరణదండన

పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…

3 hours ago

కొణిదెల రూపురేఖలు మార్చేసిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటిస్తే.. అది అమ‌లు కావాల్సిందే!. అది గిరిజ‌న ప్రాంత‌మైనా.. మైదాన ప్రాంత‌మైనా.. చెప్పిన‌ట్టు…

4 hours ago