Trends

మార్కులు వేయకుంటే చేతబడే..

పరీక్షల కోసం సరిగ్గా చదవని వాళ్లు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎన్నెన్నో వేషాలు వేస్తారు. చిట్టీలు పెట్టి కాపీ కొట్టడానికి చూస్తారు. లేదంటే పక్కోడి పేపర్ చూసి జవాబులు దించేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం పరీక్ష పేపర్లలో ఏవో కాకమ్మ కథలు రాయడం.. లేదంటే తమ శాడ్ స్టోరీస్ రాసి.. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

కానీ ఇక్కడో లెజెండ్ మాత్రం తన పరీక్ష పేపర్లో ఇచ్చిన వార్నింగ్‌ చూసి పేపర్ దిద్దే ఉపాధ్యాయుడు అవాక్కవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేస్తానని సదరు విద్యార్థి ఓ ప్రశ్నకు సమాధానంగా రాయడం గమనార్హం. ఇది ఆంధ్రా ప్రాంతంలోని బాపట్లలో జరిగింది.

బాపట్ల పురపాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. తెలుగు పరీక్షలో ‘రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి’ అంటూ ఓ ప్రశ్నకు ఓ విద్యార్థి తగిన సమాధానం ఇవ్వకుండా.. ‘‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’’ అని రాశాడు. ఇది చూసి మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయుడు షాక్ తిన్నాడు.

జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపించగా విషయం మీడియా వరకు చేరి ఈ విషయం వార్తగా మారింది. విశేషం ఏంటంటే.. సదరు విద్యార్థి చదువులో అంత పూర్ ఏమీ కాదు. తెలుగు సబ్జెక్టులో అతడికి ఓవరాల్‌గా 70 మార్కులు వచ్చాయి. ఏమీ రాని వాడైతే ఇలా ఆన్సర్ రాస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ 70 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ ఒక ప్రశ్నకు ఇలాంటి జవాబు రాయడమే విడ్డూరం.

This post was last modified on April 12, 2024 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మా మంచి ఎమ్మెల్యే.. ఈ మాట‌ను కాపాడుకోవాలి …!

మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా త‌క్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల సంతృప్తి - అసంతృప్తి…

4 hours ago

జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులూ…

5 hours ago

మతిపోయే రేటు చెబుతున్న రామాయణ ?

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…

7 hours ago

జ‌గ‌న్‌ను వారెందుకు క‌లిశారు: లోకేష్ ఆరా

మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఎవ‌రికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జ‌గ‌న్‌ను కొంద‌రు క‌లుస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది..?…

7 hours ago

జగన్ రైటు… జనమే రాంగా?

ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔన‌నే ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు మెచ్చుతారా..…

8 hours ago

యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. మోడీది రాజ‌కీయ‌మే

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌లకు ఏం…

9 hours ago