Trends

బిలియనీర్ల సిటీగా ముంబయి.. బీజింగ్ ను దాటేసింది!

తాజాగా విడుదలైన హురుస్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిలియనీర్ల సిటీగా ముంబయికి గుర్తింపు లభించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే చైనా రాజధాని బిజింగ్ ను దాటేసింది దేశ ఆర్థిక రాజధాని. తాజాగా విడుదలైన జాబితాలో ముంబయిలో 92 మంది అత్యంత సంపన్నులు ఉన్నారని.. అదే సమయంలో బీజింగ్ లో ఈ సంఖ్య 91గా ఉండటం గమనార్హం.
చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్ లో మాత్రం 271 మంది ఉన్నట్లుగా పేర్కొంది.

దేశీయంగా కుబేరుల మొత్తం సంపద లక్ష కోట్ల దాలర్ల స్థాయిలో ఉందని పేర్కొంది. దేశంలో అత్యంత సంపన్న భారతీయుడిగా రిలయన్స్ అధినేత ముకేష్ అంభానీ మరోసారి నిలిచారు. ఆయన ఆస్తి విలువ 115 బిలియన్ డాలర్లుగా తాజా జాబితా వెల్లడించింది. ఏడాది వ్యవధిలో ముకేశ్ అంబానీ ఆస్తి విలువ మరో 40 శాతం పెరిగినట్లుగా పేర్కొంది. ఇది 33 బిలియన్ డాలర్లకు సమానం. గత ఏడాది హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా దెబ్బ తిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. ఆయన సంపద ఏడాదిలో 62 శాతం పెరిగింది.

అంతర్జాతీయంగా ముకేశ్ అంబానీ పదో స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ పదిహేనో స్థానంలో నిలిచారు. హిండెన్ బర్గ్ నివేదికకు ముందు ప్రపంచంలోని టాప్ 5 సంపన్నుల జాబితాలోకి వెళ్లటం.. ముకేశ్ అంబానీని అధిగమించటం తెలిసిందే. ఇక.. ప్రపంచ సంపన్నుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నిలిచారు. ఆయన ఆస్తి మొత్తం 231 బిలియన్ డాలర్లుగా తేల్చారు. కొత్త బిలియనీర్ల జాబితాలో చైనాను భారత్ అధిగమించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. భారత్ నుంచి ఈ జాబితాలో 94 మంది చోటు దక్కించుకోగా.. చైనా నుంచి మాత్రం 55 మందికి మాత్రమే చోటు లభించింది. ఏడాది వ్యవధిలో ముంబయిలో 27 మంది బిలియనీర్లు ఉండగా.. బీజింగ్ లో మాత్రం ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకోవటం గమనార్హం.

Satya

Recent Posts

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

30 minutes ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

51 minutes ago

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…

1 hour ago

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…

3 hours ago

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

4 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

6 hours ago