Trends

క‌రోనా నుంచి కోలుకున్నారా.. లైట్ తీస్కోకండి

క‌రోనా వ‌చ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జ‌నాలు. క‌రోనా రాక‌ముందు, వ‌చ్చాక ఉన్న భ‌యం, ఆందోళ‌న అంతా ప‌క్క‌కు వెళ్లిపోతాయి. వైర‌స్ వ‌చ్చి వెళ్లిపోయింది. ఇక మ‌న‌కేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. క‌రోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ‌ హెచ్చ‌రించింది. ఈమేర‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. దీనిపై ఎక్కువ ఆందోళ‌న అవ‌స‌రం లేదంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ‌ మార్గదర్శకాల్లో పేర్కొంది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది.

ఎప్పటిలాగే మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని స్ప‌ష్టం చేసింది. అలాగే గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ వైర‌స్‌తో పోరాటంలో శ‌రీరం బ‌ల‌హీన‌ప‌డుతుంది కాబ‌ట్టి వేరే ఇబ్బందులు రాకుండా.. మ‌రోసారి వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ పాటించాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

This post was last modified on September 13, 2020 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago