కరోనా వచ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జనాలు. కరోనా రాకముందు, వచ్చాక ఉన్న భయం, ఆందోళన అంతా పక్కకు వెళ్లిపోతాయి. వైరస్ వచ్చి వెళ్లిపోయింది. ఇక మనకేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈమేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. దీనిపై ఎక్కువ ఆందోళన అవసరం లేదంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది.
ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్తో పోరాటంలో శరీరం బలహీనపడుతుంది కాబట్టి వేరే ఇబ్బందులు రాకుండా.. మరోసారి వైరస్ బారిన పడకుండా ఈ జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
This post was last modified on September 13, 2020 10:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…