కరోనా వచ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జనాలు. కరోనా రాకముందు, వచ్చాక ఉన్న భయం, ఆందోళన అంతా పక్కకు వెళ్లిపోతాయి. వైరస్ వచ్చి వెళ్లిపోయింది. ఇక మనకేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈమేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. దీనిపై ఎక్కువ ఆందోళన అవసరం లేదంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది.
ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్తో పోరాటంలో శరీరం బలహీనపడుతుంది కాబట్టి వేరే ఇబ్బందులు రాకుండా.. మరోసారి వైరస్ బారిన పడకుండా ఈ జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
This post was last modified on September 13, 2020 10:17 pm
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…