Trends

ధోని విషయంలో ఇక ఫిక్సయిపోవచ్చు

భారత లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లేనా? ఈ ఏడాది ఐపీఎల్‌తో అతను ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నట్లేనా? ఔననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ధోని ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించట్లేదన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ చర్చే జరుగుతోంది.

చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అతను పగ్గాలు అప్పగించేశాడు. ధోని రెండేళ్ల ముందు కూడా ఇలాగే చేశాడు. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించి తాను ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగాడు. కానీ జడేజా ఒత్తిడికి గురి కావడం, జట్టును సరిగా నడిపించలేకపోవడంతో సీజన్ మధ్యలో తిరిగి కెప్టెన్సీ తీసుకున్నాడు. గత సీజన్లో పూర్తిగా అతనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఈ సీజన్ ముంగిట రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించాడు.

ఐతే ఈ సీజన్లో చెన్నై ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ధోని తిరిగి కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ధోని వచ్చే సీజన్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఐపీఎల్ అయిన కొన్ని రోజులకు ధోనికి 43 ఏళ్లు నిండుతాయి. 40 ఏళ్లు దాటాక ఐపీఎల్ ఆడటం అంత తేలిక కాదు. ఎలాగోలా మూడేళ్లు కెరీర్‌ను పొడిగించాడు.

ధోని కెప్టెన్‌గా కొనసాగితే ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగించడానికి చెన్నై ఫ్రాంఛైజీకి ఓకే. కానీ ఒక స్థాయికి మించి ఆటలో కొనసాగడం కష్టం. ధోనికి ఇప్పటికే మోకాలి సమస్య ఉంది. మునుపట్లా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. వికెట్ల మధ్య పరుగులోనూ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ సీజన్ అయ్యాక అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలే ఎక్కువ. అందుకే ముందే కెప్టెన్సీని రుతురాజ్‌కు అప్పగించేశాడు. ఈ సీజన్లో అతణ్ని గైడ్ చేస్తూ చెన్నై జట్టును పటిష్టం చేయడానికి ధోని ప్రయత్నించనున్నాడు. సీజన్ చివర్లో అతను రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.

This post was last modified on March 21, 2024 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

43 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago