ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే .. ఆరోగ్యంగా ఉంటారా? నాశనమై పోతారా? అంటే.. దీనిలో తడుముకోవా ల్సిన ఏమీ లేదు. ఎంతటివారైనా నాశనం అయిపోతారు. కానీ, సరదాకు చెప్పారో.. నిజ్జంగా నిజమేనో తెలియదు కానీ… తన ఆరోగ్య రహస్యం డ్రగ్సేనని టెస్లా అధినేత, ట్విట్టర్(ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ మాత్రం తన ఆరోగ్య రహస్యం డ్రగ్సేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తను వాడే డ్రగ్స్ పేరును కూడా ఆయన చెప్పారు. అదే `కెటామైన్`.
అక్కడితో కూడా మస్క్ ఆగిపోలేదు.. తన దిగ్గజ కంపెనీ టెస్లా ను విజయవంతంగా నిర్వహించడంలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడుతోందని బాంబు పేల్చారు. ఇటీవల ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. “డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నా. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి డ్రగ్ని ఉపయోగిస్తున్నా“ అని మస్క్ చాలా కాన్పిడెంట్గా చెప్పడం గమనార్హం.
మెడికేషన్లో భాగంగా కెటామైన్ వాడుతున్నానని, ఒక వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకుంటానని మస్క్ వివరించారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఉందని వివరించారు. కెటామైన్ను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే పనిని పూర్తి చేయలేరని, తనకు చాలా పని ఉంటుందని మస్క్ అన్నారు. రోజులో 16 గంటలపాటు పని చేస్తుంటానని అన్నారు. అయితే.. ఇది తనకు మాత్రమే పరిమితమని.. ఇది తాను ఎవరికీ దిశానిర్దేశం చేసేందుకు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా సహా భారత్ వంటి అనేక దేశాల్లో డ్రగ్స్పై నిషేధం ఉంది. అయినప్పటికీ.. దొడ్డిదారిలో ఇవి రవాణా అవుతున్నాయి. వినియోగం కూడా పెరుగుతోంది. దీనిపైనే ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డ్రగ్స్ నిసేధం ఎన్నికల హామీ గా ఉండడం గమనార్హం.
This post was last modified on March 19, 2024 10:14 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…