ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఓ వ్యాపార వేత్త స్వామి భక్తి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా తన వ్యాపారాలు పుంజుకున్నాయని ఆయన తెలిపారు. అందుకే ఆయనపై ఉన్న భక్తి, ప్రేమలతో ప్రధాని నరేంద్ర మోడీ జీవించి ఉండగానే ఆయన భారీ విగ్రహం నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఆయనే.. ఈశాన్య రాష్ట్రం అస్సాంకు చెందిన నవీన్ చంద్రబోరా. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ , సహా.. గనుల వ్యాపారిగా పేరు పొందారు. టీ తోటలు కూడా ఉన్నాయి.
గడిచిన 8 ఏళ్ల కాలంలో బోరా వ్యాపారాలు నాలుగింతలయ్యాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు రుణ మాఫీ చేసిన నేపథ్యంలో ఈయనకు కూడా.. భారీ రిలీఫే లభించింది. ఇదెలా ఉన్నా.. ఇప్పుడు ఆయన సంచలన ప్రకటన చేశారు. కేవలం ఇక్కడితోనే ఆయన ఆగిపోలేదు. కార్యరంగంలోకి కూడా దిగిపోయారు. గౌహతికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో నే మోడీకి విగ్రహం నిర్మించాలని బోరా నిర్ణయిం చి.. తాజాగా భూమి పూజలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ పూజలు కొనసాగుతున్నాయి.
కాగా, ప్రధానికి తాను వీర విధేయుడినని.. ఆయన పాలన బాగుందని బోరా వెల్లడించారు. మోడీ విగ్రహాన్ని 200 కోట్లరూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. మొత్తం సొమ్మంతా తనదేనన్నారు. ఈ విగ్రహం.. మొత్తం 250 అడుగుల ఎత్తు ఉండగా.. బాటం ప్లేస్ 60 అడుగులు ఉంటుందని. విగ్రహం 190 అడుగులు ఉంటుందని.. మొత్తంగా దేశంలోని ఎత్తయిన విగ్రహాల్లో ఇది కూడా చోటు సంపాయించుకుంటుందన్నారు.
ప్రస్తుతం దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏర్పాట్లు చేయడం.. సహకరించడం గమనార్హం. ఈవిగ్రహం పూర్తయితే.. దేశ స్వాతంత్య్ర చరిత్రలో జీవించి ఉన్న ప్రధానికి విగ్రహం కట్టడం ఇదే తొలిసారి కానుంది.
This post was last modified on January 31, 2024 1:55 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…