తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత.. అనేక సంచనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోపణలు, వివాదాలను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా సహించడం లేదు. ఏ చిన్న వివాదమైనా.. పెద్ద వివాద మైనా కూకటి వేళ్లతో సహా తొలగించేయాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివాదాల్లో చిక్కుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై గుండుగుత్తగా వేటు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?
ఇటీవల కాలంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవలే.. ఓ సీఐని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత..అవినీతి ఆరోపణలతో ఒక కానిస్టేబుల్ను విధుల నుంచి తప్పించారు. ఇక, కొందరు పోలీసులు తీవ్ర నేరగాళ్లతోనూ చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో పిట్టను కూడా మిగల్చకుండా.. గుండుగుత్తగా అందరిపైనా వేటు వేసేశారు. అంతేకాదు.. వీరికి ఎక్కడా పోస్టింగు కూడా ఇవ్వలేదు. ఈ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో సీఐలు, ఎస్సైలు, ఏఎస్ ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఇలా.. మొత్తం 85 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ గుండుగుత్తగా ఇక్కడ నుంచి తీసేసిన కమిషనర్ అడ్మిన్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వీరి స్థానంలో వివిధ స్టేషన్ల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి.. ఇక్కడ నియమించారు. ఇది సంచలన నిర్ణయంగా హోం శాఖ వర్గాలు చెబుతున్నారు.
This post was last modified on January 31, 2024 1:49 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…