తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత.. అనేక సంచనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోపణలు, వివాదాలను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా సహించడం లేదు. ఏ చిన్న వివాదమైనా.. పెద్ద వివాద మైనా కూకటి వేళ్లతో సహా తొలగించేయాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివాదాల్లో చిక్కుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై గుండుగుత్తగా వేటు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?
ఇటీవల కాలంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవలే.. ఓ సీఐని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత..అవినీతి ఆరోపణలతో ఒక కానిస్టేబుల్ను విధుల నుంచి తప్పించారు. ఇక, కొందరు పోలీసులు తీవ్ర నేరగాళ్లతోనూ చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో పిట్టను కూడా మిగల్చకుండా.. గుండుగుత్తగా అందరిపైనా వేటు వేసేశారు. అంతేకాదు.. వీరికి ఎక్కడా పోస్టింగు కూడా ఇవ్వలేదు. ఈ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో సీఐలు, ఎస్సైలు, ఏఎస్ ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఇలా.. మొత్తం 85 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ గుండుగుత్తగా ఇక్కడ నుంచి తీసేసిన కమిషనర్ అడ్మిన్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వీరి స్థానంలో వివిధ స్టేషన్ల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి.. ఇక్కడ నియమించారు. ఇది సంచలన నిర్ణయంగా హోం శాఖ వర్గాలు చెబుతున్నారు.
This post was last modified on January 31, 2024 1:49 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…