కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మరోసారి చర్చకు రావటమే కాదు.. ఈ ఉద్యాన నగరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది.
మరికాసేపట్లో పెళ్లి చేసుకునేందుకు అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో వెళితే.. కచ్ఛితంగా ఆమె పెళ్లి ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకునే అవకాశం లేదు. దీంతో.. ఏం చేయాలన్న ఆందోళనతో ఇంట్లోని వారు ఉంటే.. మరేం ఫర్లేదంటూ దగ్గర్లోని మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. రాణి మాదిరి ఆమె నడుస్తుంటే.. అసలేం జరిగిందో అర్థం కాక పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తున్న వేళ.. సమయానికి మండపానికి చేరుకోవటానికి మెట్రోను ఆశ్రయించారన్న విషయం తెలిసినంత ఆమెను అభినందించటమే కాదు.. స్మార్ట్ గా ఆలోచిస్తున్నావంటూ అభినందనలు తెలియజేశారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.
మొత్తంగా ఆమె ఐడియా ఫలించి.. ముహుర్తానికి ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ వైరల్ వీడియోలో మెట్రో ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కిన ద్రశ్యాలతో పాటు.. ఆమె ప్రయాణిస్తున్న వైనం కనిపిస్తుంది. ‘ఆమె ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ అని ఒకరు.. ‘స్మార్ట్ థింకర్’ అని మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…