కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మరోసారి చర్చకు రావటమే కాదు.. ఈ ఉద్యాన నగరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది.
మరికాసేపట్లో పెళ్లి చేసుకునేందుకు అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో వెళితే.. కచ్ఛితంగా ఆమె పెళ్లి ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకునే అవకాశం లేదు. దీంతో.. ఏం చేయాలన్న ఆందోళనతో ఇంట్లోని వారు ఉంటే.. మరేం ఫర్లేదంటూ దగ్గర్లోని మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. రాణి మాదిరి ఆమె నడుస్తుంటే.. అసలేం జరిగిందో అర్థం కాక పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తున్న వేళ.. సమయానికి మండపానికి చేరుకోవటానికి మెట్రోను ఆశ్రయించారన్న విషయం తెలిసినంత ఆమెను అభినందించటమే కాదు.. స్మార్ట్ గా ఆలోచిస్తున్నావంటూ అభినందనలు తెలియజేశారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.
మొత్తంగా ఆమె ఐడియా ఫలించి.. ముహుర్తానికి ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ వైరల్ వీడియోలో మెట్రో ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కిన ద్రశ్యాలతో పాటు.. ఆమె ప్రయాణిస్తున్న వైనం కనిపిస్తుంది. ‘ఆమె ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ అని ఒకరు.. ‘స్మార్ట్ థింకర్’ అని మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on January 28, 2024 2:44 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…