Trends

బెంగళూరు ట్రాఫిక్ జాంలో వధువు.. కట్ చేస్తే..

కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మరోసారి చర్చకు రావటమే కాదు.. ఈ ఉద్యాన నగరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది.

మరికాసేపట్లో పెళ్లి చేసుకునేందుకు అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో వెళితే.. కచ్ఛితంగా ఆమె పెళ్లి ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకునే అవకాశం లేదు. దీంతో.. ఏం చేయాలన్న ఆందోళనతో ఇంట్లోని వారు ఉంటే.. మరేం ఫర్లేదంటూ దగ్గర్లోని మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. రాణి మాదిరి ఆమె నడుస్తుంటే.. అసలేం జరిగిందో అర్థం కాక పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

పెళ్లి ముహుర్తం ముంచుకొస్తున్న వేళ.. సమయానికి మండపానికి చేరుకోవటానికి మెట్రోను ఆశ్రయించారన్న విషయం తెలిసినంత ఆమెను అభినందించటమే కాదు.. స్మార్ట్ గా ఆలోచిస్తున్నావంటూ అభినందనలు తెలియజేశారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.

మొత్తంగా ఆమె ఐడియా ఫలించి.. ముహుర్తానికి ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ వైరల్ వీడియోలో మెట్రో ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కిన ద్రశ్యాలతో పాటు.. ఆమె ప్రయాణిస్తున్న వైనం కనిపిస్తుంది. ‘ఆమె ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ అని ఒకరు.. ‘స్మార్ట్ థింకర్’ అని మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

This post was last modified on January 28, 2024 2:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

39 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago